గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక.

*గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మక..

*సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 అవార్డును అందుకున్న రాజన్న ఫౌండేషన్..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 17:

అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని లిమిరోడియన్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్
కేంద్ర ఉపరితల మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వాటర్ చెక్ డాన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఉచిత వైద్య సేవలు,తాగునీటి సౌకర్యాలు మరియు పశుసంవర్ధక ఆసుపత్రి ఇతర సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది మా కార్యక్రమాలు ద్వారా గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని మా సంస్థ ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని తద్వారా మా వంతు కృషి చేస్తున్నాము ముందు కూడా చేస్తుంటాము మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా రాజన్న ఫౌండేషన్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని అని అన్నారు..

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

లైన్స్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ ఎం. జె.ఎఫ్ కల్మచర్ల రమేష్ ను ఘనంగా సన్మానించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. లైన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జన్మదినాన్ని పురస్కరించుకొని కల్మచర్ల రమేష్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎలక్ట్రిక్ డ్రం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోశాధికారి గోవింద శ్రీనివాస్, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ బచ్చు రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్ కుమార్, ఉప్పు ఆంజనేయులు, బాదం రాఘవేందర్, చెదిరే శ్రీనివాస్, నీలా కోటి, మాచిపెద్దిరవి తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version