కిల్లర్‌ లుక్‌..

కిల్లర్‌ లుక్‌

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక…

ఎస్‌. జే సూర్య కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లర్‌’. వీసీ ప్రవీణ్‌, బైజు గోపాలన్‌ కలసి నిర్మిస్తున్నారు. ప్రీతి అస్రాని కథానాయిక. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. శనివారం చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. గన్‌ పట్టుకొని, ప్రీతి అస్రానీని భుజాన ఎత్తుకున్న లుక్‌ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి ఏ. ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి.

ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి…

 

రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

లీడ్స్ టెస్ట్‌లో విజయంతో ఫుల్ ఖుషీగా ఉంది ఇంగ్లండ్. టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించడంతో స్టోక్స్ సేన కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇదే జోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో కూడా గెలుపుబావుటా ఎగురవేయాలని చూస్తోంది ఆతిథ్య జట్టు.
ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్టార్ పేసర్‌ను పక్కనబెట్టేసింది.
అతడ్ని తీసుకుంటారంటూ బాగా ప్రచారం జరిగినా తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు.
అతడు ఎవరనేది ఇప్పుడు చూద్

 

ఎందుకు తీసుకోలేదు?

తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కూ యథావిధిగా కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ ఆడతారు.

హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌ బరిలోకి దిగుతాడు.

అయితే అంతా బాగానే ఉన్నా పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కౌంటీల్లో అదరగొట్టిన ఆర్చర్.. ఫామ్, ఫిట్‌నెస్ రెండూ నిరూపించుకున్నాడు.

దీంతో అతడ్ని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం అవకాశం కల్పించలేదు.

ఆర్చర్ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాలని పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే ఆడించాలనే ఆలోచనల్లో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి..

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు వేల ఒక వంద రూపాయలు,మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్ మరియు పేక పత్తలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 మంద కుమారస్వామి
2 రాచర్ల రమేష్
3 చెరుకు మహేష్
4 కొక్కుల రవీందర్
5 పెండెం సమ్మయ్య
6 పెండెమ్ లక్ష్మణ్
7 పసెడ్ల స్వామి. 8 పసెడ్ల సతీష్.9 గడ్డం యాదగిరి లు వీరందరిది ఓదెల గ్రామమే నని తెలిపారు.
ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. .
ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గారితో పాటు, కానిస్టేబుల్ రాజేందర్, ప్రశాంత్, రామకృష్ణ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version