చేర్యాల పట్టణం పూర్తిగా జలమయం…

చేర్యాల పట్టణం పూర్తిగా జలమయం

కనబడని మున్సిపల్ అధికారులు

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల పట్టణంలో చిన్న చెరువు పెద్ద చెరువు భూకబ్జాల కారణంగా చేర్యాల పట్టణమంతా పూర్తిగా జలమయమైనది పలు కాలనీలలో ఇంటి లోపలికి నీరు వస్తున్నడంతో ప్రజలు పలువురు ఇబ్బంది పడ్డారు గాంధీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు

ఈ సందర్భంగా చేర్యాల పట్టణమంతా గాంధీ చౌరస్తా వద్ద భూకబ్జాలతో

మరియు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం కాకుండా పూర్తిగా నెమ్మదిగా చేయడం వలన చేర్యాల సిద్దిపేట నేషనల్ హైవే పై మరియు చేర్యాల నుండి కడవేరుగు పోయే రోడ్డు కూడా పూర్తిగా మోకాళ్ళ లోతు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరియు వాహనదారులు తమ వాహనాలు తో ఇబ్బంది పడడం కనబడినది అయినను మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది చొరవ తీసుకొని అక్రమ కట్టడాలను కూల్చకుండా కబ్జాలను ప్రోత్సహిస్తూ పలువురికి కొమ్ముకాస్తుండడం తీరుపై ప్రజలు ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తం చేస్తున్నారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికీ చాలాసార్లు వర్షం వచ్చినప్పుడు జలమయమైన నామవాత్రపు చర్యలతో అప్పటికప్పుడు సమస్యను పరిష్కరించి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రెండు చెరువుల మధ్యలో ఉన్న చేర్యాల మున్సిపల్ ప్రాంతాన్ని నీటి గండాల నుండి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నది అన్నారు చేర్యాల సిఐ ఎల్ శ్రీను మరియు చేర్యాల ఎస్సై నవీన్ మరియు వారి సిబ్బంది జెసిబి సహాయంతో అక్కడ ఉన్న నీటిని మళ్లించే కార్యక్రమం చేశారు కానీ శాశ్వత పరిష్కారం కొరకు ప్రజలు పట్టణవాసులు వాహనదారులు ఎదురుచూస్తున్నారు ఈ సమస్యపై అందరు పరిష్కారం కోరుకుంటున్నారు

తాగునీటి సమస్యను పరిష్కరించండి

తాగునీటి సమస్యను పరిష్కరించండి
మహాదేవపూర్ ఆగస్టు13(నేటి ధాత్రి

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామంకుదురుపల్లి గ్రామపంచాయతీ కి
గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలు మంగళవారం గ్రామంలోని గ్రామ కార్యదర్శికి నీటిసమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించిచారు మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ని పాత గూడెంలో గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గతంలో అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని త్రాగునీటికి సంబంధించి తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదని వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధులు వచ్చి అవకాశాలు ఉన్నాయని తాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రత్నం నాగరాజు గోగులబాపు రాజయ్య లక్ష్మి పద్మ లచ్చయ్య సడవలి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version