కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూడెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కంకర పోసి అలాగే వదిలేయ డంతో నడవాలంటే ప్రయాణం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
People have problems.
రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే రోడ్డుపన్నులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
పదోన్నతి పొందిన ఖిలాఘనపూర్ ఏ ఎస్సై ఎం సుధాకర్ ఎస్సైగా. వనపర్తి రూరల్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారు గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావు ల గీరీదర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశరు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ అదనపు ఎస్పీ.మహేశ్వరరావు పదోన్నతి పొందిన ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం
బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి
ముత్తారం :- నేటి ధాత్రి
శాసన సబ ఎన్నికల ముందు కాంగ్రేస్ పార్టీ ప్రజలకు ఇచ్చినా హమీలు అమలు చేయడంలో మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మెల్యే తో ప్రబుత్వం పూటకో ప్రకటన చేస్తుందని ముత్తారం బి అర్ ఎస్ మండల శాఖ అద్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతుపేద్ది కిషన్ రేడ్డి శనివారం ఒక ప్రకటనలో అరోపించారు పేదింటి యువతుల వివాహనికి కళ్యాణ లక్ష్మి పథకం లో భాగంగా లక్ష 116 రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని మహిళలకు నెలకు 2500 వారి ఖాతలలో జమ చేస్తామని ఎన్నికల ముందు హమి ఇచ్చారని ప్రస్తుతం కాంగ్రేస్ మిత్రపక్షమైనా సిపిఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు కోత్తగూడేం లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసి తులం బంగారం ప్రబుత్వం ఇప్పట్లో ఇచ్చే అలోచన లేదని ప్రకటించడం హస్య స్పందంగా ఉందని అన్నారు మహిళలకు 25 వందల ఊసే లేదన్నారు సిపిఐ పార్టీకి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినా చరిత్ర కల్గినా పార్టీ ని నేడు ప్రజలలో చీప్ గా తయారు చేసారని కిషన్ రేడ్డి ఒక ప్రకటనలో విమర్సించారు
◆ : ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ చిరాగ్ పల్లిలో పాఠశాల నిర్మాణం
◆ : ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు
” ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే నాయకుడు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు భరోసా కలిపించే వాడే నాయకుడు, తండ్రి బాటలో నడుస్తూ వృత్తి రీత్యా వైద్యుడు ఆయన వైద్యునిగా కొనసాగుతూనే జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు నేనున్నాని భరోసా కలిపిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటు పేద ప్రజల సమస్య తీరుస్తున్న నాయకుడు ఆయన, అతని ఎవరో కాదు చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ మండలం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరాగ్ పల్లి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్, ఉజ్వల్ రెడ్డి గత కొంతకాలం నుండి అమెరికాలో వైద్య సేవలు చేస్తూ తాను జన్మించిన గడ్డపైన పేదలకు ఎదో మంచి చేయాలనుకుని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించారు కాని ఎంపీగా టికెట్ రాకపోయిన కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి క్రమశిక్షణ కలిగి, నేటి జహీరాబాద్ ఎంపీ సురేష్ కెట్కర్ కు మద్దతుగా ఆయన విజయానికి కృషి చేశారు. కాని ఎంపీ టికెట్ రాలేదని ఎక్కడ నిరాశచందకుండా పేద ప్రజలకు అండదండగ ఉంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, పేద ప్రజల సమస్యలను ఓపిగగా వింటు తన సొంత సమస్యగా పరిగనించి పరిష్కరిస్తున్న నాయకుడు. ఇటీవలే జహీరాబాద్ మండలం తన స్వగ్రామం అయిన చిరాగ్ పల్లిలో పేద విద్యార్థుల గురించి సొంత నిధులు ఖర్చు చేసి దాదాపు 6కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని సంకల్పించి సేవ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడు ఉజ్వల్ రెడ్డి, ఎటువంటి వారు సహాయం కోరిన చిరునవ్వుతో వారిని పలకరించి సమస్య తీరుస్తున్న నాయకుడు సౌమ్యుడు ప్రజల మేలు కోరే నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజకీయాలు వేరు ప్రజా సమస్యలు వేరుగా చూసి రాజకీయాలకు అతీతంగా సేవచేస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. ప్రజా సేవకుడు ప్రజలను సేవలందిస్తున్న మహా నాయకుడు ప్రజల ఆపదనులను ఆదుకుంటున్న ప్రజా నాయకులు ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు డాక్టర్ ఉజ్వల రెడ్డి.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…
వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.
ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలని మల్లయ్య గుట్ట పీఠాధిపతి డాక్టర్ బసవలింగ అవధూత గిరి మహారాజ్ చెప్పారు. న్యాల్కల్ మండలం మరియం పూర్ గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని కల్వరీ గుట్ట మీద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు మరియు వాటర్ ట్యాంక్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వరీ గుట్ట పైకి వచ్చి ప్రార్థనలు నిర్వహించుకునే క్రైస్తవ సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ ను అలాగే తాగునీటి సౌకర్యం కొరకు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. భక్తులకు ఇన్నాళ్లు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజిమొగ్గ నరసింహులు, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి , కల్వరీ ఎంబీ చర్చి పాస్టర్ మరియు చైర్మన్ ఎస్.వరప్రసాద్, వైస్ చైర్మన్ జాకబ్, సెక్రెటరీ డేవిడ్, రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎండలు మండుతున్న దరిమిలా. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ప్రజలకు సూచించారు. పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరులోని సి.యస్.ఐ. చర్చిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపు నిర్వహించిన పెరికే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరికే వరప్రసాద్ ను ఈ సందర్భంగా ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. ఉచితంగా పరీక్షల నిర్వహించుకున్న రోగులకు ఆయన మందులను పంపిణీ చేశారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షల నిర్వహించుకొని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, సి.యస్.ఐ.చర్చ్ మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు..
రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి
★గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
టీపీసీసీ ఏక్సిక్యూటివ్ మెంబెర్ ధనాలక్మి కోహిర్ మండలంలోని పిచరాగాడి గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ” రాజ్యాంగ పరిరక్షణ సన్నాక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్. మరియు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ ప్రజలకు వివరించారు. యాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ మాజీ మంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీర రెడ్డి,కోహిర్ టౌన్ అధ్యక్షులు.శంషీర్,మాజీ ఎంపిపి షౌకత్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజమ్మిల్,బాడంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ దయానంద పాటిల్, మాజీ సర్పంచ్ అంజయ్య ,మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోన ముస్లిం ప్రార్థన మందిరంలో రంజాన్ వేడుకలు
*పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముస్లిం పెద్దలు అన్నారు *
Ramadan
*ఈద్-ఉల్-ఫీతర్ (పవిత్ర రంజాన్) పర్వదినం పురస్కరించుకొని ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు మైదానంలో ముస్లిం సోదర అందరూ ప్రార్థనలు చేశారు ముస్లిం ప్రార్థన గురువు మసీద్ సదర్ ఎండి యూసుఫ్ పాషా ముఖ్య అతిథులుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ *వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటి రంజాన్ అని కొనియాడుతూ చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌబ్రతృత్వ గుణాలు పంచుతుందని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్లింలకు పెద్దపేట వేస్తుందని అన్నారు. అల్లా దయతో ఈ పండుగ మానవాళికిచ్చే గొప్ప సందేశమని అన్నారు.
మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య `మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి `బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు `అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు `మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి `జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది కాంగ్రెస్ పార్టీ నిధానం `లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్ పార్టీ విధానం : కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ కమ్మాగొని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్ నాగరాజు డా: బీ అర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్ చెప్పినవే . ఓ. ఏస్.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్,ఐపీఎస్,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్ అంబేద్కర్ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ని జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్ పార్టీ జై బాపు,జై బిమ్,జై సంవిధాన్ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.
భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ప్రజలకు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రజలు అప్రమత్తంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.తెలిపారు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉ ష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ జారీ చేయడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం అయితేనే బయటకు రావాలని వచ్చేముందు వాహనదారులు తలకు హెల్మెట్ ధరించాలని తెలిపారు హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల జిల్లాలలో 42 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒకవైపు ఎండలు పెరగడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవసరమైతేనే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదని సూచించారు. బయటకు వెళ్లిన గొడుగులు వెంట తీసుకువెళ్లాలని సూచించారు ఎండ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.సూచించారు.
రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా..
జహీరాబాద్. నేటి ధాత్రి:
Ramadan
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ నెలలో సెహ్రీ, ఇఫ్తార్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా రంజాన్ నెలలో ఉపవాసం చేసిన ముస్లింలందరూ ఖర్జూరం తిని తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు రకరకాల ఆహారపదార్ధాలు, పండ్లు ఉన్నా… ఒక్క ఖర్జూరంతోనే అది కూడా మూడు ఖర్జూరాలు తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా.. ఇలా చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..ఇస్లాం మతంలో రంజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 28న సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ మాసం ప్రారంభం అయింది. మార్చి 1వ తేదీన మొదటి ఉపవాసం పాటించారు. మార్చి 1న భారతదేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. దీంతో భారతదేశంలో రంజాన్ నెల ప్రారంభం అయింది. ఉపవాసం దీక్షను మార్చి 2నుంచి ప్రారంభిస్తున్నారు. రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు సెహ్రీ, ఇఫ్తార్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఉపవాసం దీక్ష విరమించి తర్వాత తీసుకునే విందుని ఇఫ్తార్ అని అంటారు. ఈ ఇఫ్తార్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖర్జూరం. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ఇతర దేశాల్లోని ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి.. సూర్యాస్తమం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం విరమిస్తారు. అయితే ఖర్జూరంతోనే ఉపవాసం ఎందుకు విరమింస్తారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఖర్జూరంతో ఉపవాసం ఎందుకు విరమిస్తారంటే..
రంజాన్ సమయంలో ఖర్జూరాలను ఉపవాసం విరమించడం సున్నత్గా పరిగణించబడుతుంది. దీని కారణం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ఖర్జూర పండ్లను చాలా ఇష్టపడేవాడట. దీంతో ఆయన ఉపవాసం ముగించే సమయంలో ఖర్జురాలను తినేవారు. అంటే ఆయన ఖర్జూరాలు తిని ఉపవాసం ముగించేవారు. అప్పటి నుంచి ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సంప్రదాయంగా.. మారింది. దీనిని సున్నత్ గా పిలుస్తారు.. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
ఇస్లాంలో సున్నత్ అంటే అర్ధం ఏమిటంటే..
ఇస్లాంలో సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం అంటే ప్రవక్త ముహమ్మద్ చూపిన అడుగుజాడలను అనుసరించడం. సున్నత్ అనే పదానికి అర్ధం ఖురాన్లో చాలా చోట్ల దేవుని మార్గం అని సూచిస్తుంది.
ఇఫ్తార్లో ఎన్ని ఖర్జూరాలు తింటారంటే..
ప్రవక్త ముహమ్మద్ తన ఉపవాసం ముగించడానికి మూడు ఖర్జూరాలు తిని.. నీటిని ఉపయోగించేవారట. దీంతో ఇప్పటికీ చాలా మంది ముస్లింలు మూడు ఖర్జూరాలు తిని అనంతరం నీటిని తాగి తమ ఉపవాసాన్ని ముగిస్తారు. అల్లాహ్ దూత ప్రార్థనకు ముందు పండిన ఖర్జూర పండ్లు తిని తన ఉపవాసాన్ని విరమించారని హదీసులో ప్రస్తావించబడింది. అదే విధంగా
సహీహ్ అల్-బుఖారీ (5445)లో ఎవరైతే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం ఏడు అజ్వా ఖర్జూరాలు తింటారో ఆ రోజు వారికి ఎటువంటి విషం లేదా మంత్రవిద్య హాని కలిగించదని.. అతని అల్లా రక్షణలో ఉండటాన్ని పేర్కొన్నారు.
ఖర్జూరంతో ఉపవాసం విరమించడం అవసరమా?
రంజాన్ నెలలో ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సున్నత్.. అయితే ఇలా చేయడం తప్పనిసరి కాదు. ఖర్జూరాలతో ఉపవాసం విరమించకపోయినా ఎటువంటి సమస్య లేదు. అయితే ఖర్జూరంతో ఉపవాసం విరమించడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.
రంజాన్లో ఖర్జూరాలు ఎందుకు ఉపయోగిస్తారంటే శాస్త్రీయ కారణం- ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉపవాసం తర్వాత వచ్చే బలహీనత, అలసట లేదా తలనొప్పి వంటి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందువల్ల ఉపవాసం విరమించే సమయంలో ముందుగా ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరం.
ఖురాన్ లో ఖర్జూరాల గురించి ప్రస్తావన.
ఇస్లాంలోని అత్యంత పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఖర్జూరం ఇతర చెట్ల గురించి దీని పండ్ల కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. ఖురాన్లో ఖర్జూరాలను 22 సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇస్లాంలో వీటికి ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ముహమ్మద్ కూడా ఖర్జూరాలు తిని వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పేవారట.
మండలంలో ఆయా పార్టీల నాయకుల ప్రెస్ మీట్ లతో మండల ప్రజలు అయోమయానికి గురైతున్నారు.తంగళ్ళపల్లి మండలంలో ఒక వైపు బిఆర్ఎస్ నాయకులు మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లతో ప్రజలు అయోమయానికి లోనవుతూ మండలంలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితిని నెలకొన్నది. నువ్వా నేనా అంటూ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు, అలాగే బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపణలు మండలంలో నువ్వా నేనా అన్న చందంగా తయారైందని చర్చలు జరుగుతున్నాయి.అధికారంలో ఎవరున్నా మండలాన్ని అభివృద్ధి చేయాలే తప్పా వ్యక్తిగత దూషణలతో మాట్లాడుకోవడం సరైంది కాదని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా ఎకరిపై ఒకరు దుషించుకోకుండా సమన్వయంతో ఉంటూ మండల అభివృద్ధికి దోహద పడాలని పలువురు మండల మేధావులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు కోరుతున్నారు.
అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. ధర్మాపూర్, కోడూరు, అప్పాయపల్లి, జమిస్తాపూర్ గ్రామాలలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంతకుముందు పాలమూరు యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, మేఘా రెడ్డి, కుర్వ తిరుపతయ్య, గూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
– పాడి పంటలతో బేతిగల్ గ్రామం విరసిల్లాలి.. – బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్ బాబు.
వీణవంక, ( కరీంనగర్ జిల్లా ):
నేటి దాత్రి :వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న భూలక్ష్మి,మహలక్ష్మి,బొడ్రాయి,సహిత పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఊరిని కంటికి రెప్పలా కాపాడుకునే గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమపూజలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని,గ్రామంలోని ప్రజలందరూ పండగకు రావడం వలన గ్రామమంతా సందడిగా ఉందని అన్నారు.శ్రమ తీసుకుని ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ప్రతిష్ఠ మహోత్సవానికి తనవంతు సహకారాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బేతిగల్ గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు,వీణవంక మండల నాయకులు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం
కోట్లాది రూపాయల ధన ప్రవాహంతోనే బిజెపి గెలుపు
కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో బిజెపి కోట్లాది రూపాయలను వెదజల్లి ధన ప్రవాహంతోనే గెలిచిందని విమర్శించారు. గురువారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే బిజెపితో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకొని, లోపల నుంచి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువద్దనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ బిజెపి ఒకటయ్యాయని పేర్కొన్నారు. కేసుల నుంచి బయటపడందుకే కేసీఆర్ కొత్త నాటకం ఆడారని, చేసిన పాపం ఊరికే పోదని చెప్పారు. నరేంద్ర మోడీ ఎక్కడ తమ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తాడని భయంతోనే కెసిఆర్ బిజెపికి సపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. ఆ పార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతున్నదని, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగులకు పదేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వారికి ఏం న్యాయం చేశారు బిజెపి నేతలు ఆత్మవంచన చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పిట్టకథలు చెప్పుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు తప్ప గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయారని మండిపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్ర ప్రభుత్వం పదకోండు ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో వెల్లడించాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే యాభై ఐదువేల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు అండగా ఉంటున్నదని, నిరుద్యోగుల పక్షపాతిగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అండగా నిలిచిన నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.
అద్భుతముగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు
నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొనసాగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు ఎంతో అద్భుతంగా దేవునికి మహిమ కరంగా జరుగుతున్న ఇట్టి మహాసభలో నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుతున్నారు. నేడు సాయంత్రం చివరి రోజు కావున ఇట్టి మహాసభలో అనేకులు పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి అని ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం దైవ సేవకులు సి. హెచ్ డేవిడ్ సంఘ పెద్దలు విశ్వాసులు పిలుపునిచ్చారు.
• సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు ప్రయాణిస్తుం టారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపో కలు సాగుతుంటాయి. మాచ్నూర్ నుంచి ఝరాసంగం వరకు రోడ్డు భవనాల శాఖ రోడ్లపై ఎలాంటి సూచిక బోర్డు గాని, స్పీడ్ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవ డంతో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపాన ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. పలు మూగ జీవాలు సైతం మృతి చెందాయి.
Danger
కుప్పా నగర్ శివారులోని జట్టప్ప బావి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం, ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పొలం వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ప్రమాదకరమైన మలుపుల వద్ద పలుచోట్ల స్పీడ్ బ్రేకర్ల, సూచిక బోర్డుల కోసం రోడ్ల భవనాల శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకో వడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జహీ రాబాద్ నుంచి కుప్పా నగర్ మీదుగా రోడ్డు మార్గంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి పోచమ్మ వాగు వరకు వాహనాలు అతివేగంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుప్పా నగర్ నుంచి మల్లన్న గట్టు, బర్దిపూర్, ఎల్గోయి వెళ్లే రహదారి మలుపులు ప్రమాదక రంగా ఉన్నాయి. అదేవిధంగా ఝరాసంగం గోలి గట్టు కింద రోడ్డు వంతెన వద్ద ఇరువైపులా రోడ్డు కుంగిపోయి ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో కుప్పా నగర్ గ్రామస్తులు రోడ్డుపై బైఠారించి రాస్తారోక చేస్తామన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.