ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం.

ఆయిల్ పామ్, బహువార్షిక పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయల సాగు ప్రభుత్వ ప్రోత్సాహకా లు
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం
వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు & మల్బరీ సాగు చేయాలి.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

గురువారం తొర్రూరు మండలంలోని వెంకటాపురం, మాటేడు, హరిపిరాల, తదితర గ్రామాలలో సాగులో ఉన్న ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు సాగుపై పలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులు నికర ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా టమాట, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవవర్, తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల నారు మొక్కలను ఎకరానికి 8000 మొక్కలను ములుగు, సిద్ధిపేట జిల్లా నుండి రాయితీ పై సరఫరా సౌకర్యం ఉన్నదని తెలిపినారు. అలాగే తీగ జాతి కూరగాయల సాగుని శాశ్వత పందిరిని నూతనంగా నిర్మించి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ. 50,000/- రాయితీని రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కల్పించబడునని తెలిపారు. పామాయిల్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరాలలో అంతరపంటల కింద కూరగాయలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 2,100/- అందించబడునని తెలిపారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు సర్వేశ్వర రావు, యాకయ్య, టి. జి. ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి సి.హెచ్. రాములు, క్షేత్ర సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధులు జి. ప్రసాద్ బాబు, జి. శరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version