అధైర్య పడకండి అండగా ఉంటాం.

అధైర్య పడకండి అండగా ఉంటాం.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఇటీవల మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొక్కజొన్న దగ్ధం కాగా విషయం తెలుసుకున్న నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు పంట నష్టపోయిన రైతులను ఓదార్చి ధైర్యంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. రాత్రనకా పగలనకా కాయ కష్టం చేసి పంట పండిస్తే ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని నష్టాన్ని పూడ్చే విధంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏడిఏ దామోదర్ రెడ్డి, తహసిల్దార్ ముప్పు కృష్ణ, మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, నర్సంపేట మండల అధ్యక్షుడు కత్తి కిరణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు జిల్లా మునిందర్, జెట్టి రామ్మూర్తి, బౌసింగ్, చిట్యాల ఉపేందర్ రెడ్డి, సుధాకర్, వేముల సంపత్ రెడ్డి, వెంగళ దాస్ రమేష్, జంగిలి మోహన్, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, రఫీద్ నాయక్, సర్పంచ్ భూక్య భాస్కర్, రమణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, వెంకన్న పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తెచ్చే రైతుల పట్ల సమన్వయం పాటించి కొనుగోలు చేయాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వి ఎఫ్ జి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనసులు పొందాలని ఆయన అన్నారు. రైతులు దళారులు వద్ద మోసపోకుండా ప్రభుత్వ ఆమోదిత పొందిన కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించరలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ దామోదర్, ఏవో బన్నరజిత, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, డైరెక్టర్లు మార్తా మార్కండేయ, మంద రాజిరెడ్డి, లింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, సభ్యులు నాన బోయిన రాజారామ్, వెంగల్ దాస్ రమేష్, గుండాల శ్రీశైలం, గోనె ల నరహరి, తిరుపతి రెడ్డి, ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, పురుషోత్తం సురేష్, ఏఈఓ శ్రీకాంత్, సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ప్రభుత్వం ఆమోదితం చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు మాట్లాడుతూ దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం నుంచి ప్రకటించిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ జిల్లా ఇన్చార్జి విజయ్ భాస్కర్ రెడ్డి, నోడల్ అధికారి సోమేశ్వర్, సీఈవో ఎల్లన్న, సొసైటీ డైరెక్టర్ బత్తిని మహేష్ యాదవ్, బైరి మురళి, పోడేటి కిషోర్, జక్కుల శ్రీను, ఎద్దు సాంబయ్య, సామల సాంబయ్య, కనకం బాబు, పాండవుల శంకర్ లింగం, సిబ్బంది పెంటయ్య, రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version