కొనుగోలు కేంద్రాలు పారదర్శంగా వ్యవహరించాలి.
#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.
నల్లబెల్లి నేటి ధాత్రి:
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం తెచ్చే రైతుల పట్ల సమన్వయం పాటించి కొనుగోలు చేయాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వి ఎఫ్ జి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనసులు పొందాలని ఆయన అన్నారు. రైతులు దళారులు వద్ద మోసపోకుండా ప్రభుత్వ ఆమోదిత పొందిన కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించరలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ దామోదర్, ఏవో బన్నరజిత, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, డైరెక్టర్లు మార్తా మార్కండేయ, మంద రాజిరెడ్డి, లింగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నాగేల్లి శ్రీనివాస్, సభ్యులు నాన బోయిన రాజారామ్, వెంగల్ దాస్ రమేష్, గుండాల శ్రీశైలం, గోనె ల నరహరి, తిరుపతి రెడ్డి, ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, పురుషోత్తం సురేష్, ఏఈఓ శ్రీకాంత్, సిబ్బంది రమేష్, తదితరులు పాల్గొన్నారు.
