సొసైటీ ఏర్పాటు కోసం వినతి
నిజాంపేట: నేటి ధాత్రి
నూతన సొసైటీ ఏర్పాటు చేయాలని గ్రామాల సర్పంచులు డీసీవో కరుణాకర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్, నగరం, నంద గోకుల్ గ్రామాలకు సొసైటీ లేకపోవడం వల్ల రామాయంపేట సొసైటీ పై ఆధార పడవలసి వస్తుందని తమ సొసైటీ తమకు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, సుశీల సురేష్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, ఉడెపు కృష్ణ, లింగం, లింగం గౌడ్, రవి, కుమార్ తదితరులు ఉన్నారు.
