తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తారకరామ కాలనీ, తారక గణేశ్ మండలి ఆధ్వర్యంలో మహిళా సోదరిమణులచే సామూహిక కుంకుమార్చన, పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమం లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిట్టంపల్లి శ్రీనివాస్, ఆవునూరి తిరుపతి, కుదిరే సతీష్, పూదరి కృష్ణ, పూదరి వంశీ, నవీన్, ల్యాగల్ శ్రీనివాస్, బిక్షపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

5 వ తేదీనే గణేష్ నిమజ్జనం

గత 30 సంవత్సరములుగా రామకృష్ణాపూర్ పట్టణంలో నవరాత్రులు జరుపుకున్న తెల్లవారి నిమజ్జనం చేయడం పరిపాటని దీనికి అనంత చతుర్దశి తో సంబంధం లేదని శ్రీ కోదండ రామాలయం ఆలయ ప్రధాన అర్చకులు అంబ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు మంగళవారం అయినా శుక్రవారం అయినా తప్పులేదు కాబట్టి ఎల్లరు నవరాత్రి తదనంతరం శుక్రవారం రోజున అనగా ఐదవ తారీకు రోజున గణపతి నిమజ్జనం చేయవలసిందిగా అన్ని గణేష్ ఉత్సవ మందిర కమిటీలకు విజ్ఞప్తి చేశారు

శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…

శ్రీ సాయి గణేష్ మండలి గణపతి వద్ద సామూహిక కుంకుమార్చన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

గణపతి నవరాత్రోత్సవాల సమయంలో కుంకుమపూజ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం, అందులో భాగంగానే క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డ్ గద్దెరాగడి లో శ్రీ సాయి గణేష్ మండలి గణపతి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పసుపు, కుంకుమ ముఖ్యమైనవి, ఇవి గణేశుడికి, గౌరీదేవికి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తారు.హిందూ సంప్రదాయంలో, పసుపు, కుంకుమ అనేవి పూజా ఆచారాలలో ఒక భాగం. ఇవి సౌభాగ్యాన్ని,శ్రేయస్సును సూచిస్తాయి.గణపతి నవరాత్రోత్సవాల్లో, గణేశుడికి పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని శ్రీ సాయి గణేష్ మండలి సభ్యులు తెలిపారు.

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

నేటి ధాత్రి కథలాపూర్

 

శ్రీ సీతారామ చంద్రుల వార్షిక ఉత్సవమును పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమము జరిగినది మొదటి రోజున మూలవరులకు అభిషేక కార్యక్రమాలు అలంకరణ అర్చన రెండవ రోజు శ్రావణ మంగళవారం పురస్కరించుకొని మహిళలచే శ్రావణ మంగళ గౌరీ వ్రతము కుంకుమార్చన కార్యక్రమము నేడు స్వామివారి జన్మ నక్షత్రము పునర్వసు పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకం సహస్ర నామార్చన తులసీదల పుష్పాలచే జరిపించి హవన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో చైర్మన్ ఇట్టెడి సంజీవ్ రెడ్డి వైస్ చైర్మన్ తిక్క గంగారెడ్డి మరియు డైరెక్టర్ లు ప్రజలు హనుమాన్ భక్తమండలి వారు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version