తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

తారక గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తారకరామ కాలనీ, తారక గణేశ్ మండలి ఆధ్వర్యంలో మహిళా సోదరిమణులచే సామూహిక కుంకుమార్చన, పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమం లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిట్టంపల్లి శ్రీనివాస్, ఆవునూరి తిరుపతి, కుదిరే సతీష్, పూదరి కృష్ణ, పూదరి వంశీ, నవీన్, ల్యాగల్ శ్రీనివాస్, బిక్షపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

5 వ తేదీనే గణేష్ నిమజ్జనం

గత 30 సంవత్సరములుగా రామకృష్ణాపూర్ పట్టణంలో నవరాత్రులు జరుపుకున్న తెల్లవారి నిమజ్జనం చేయడం పరిపాటని దీనికి అనంత చతుర్దశి తో సంబంధం లేదని శ్రీ కోదండ రామాలయం ఆలయ ప్రధాన అర్చకులు అంబ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు మంగళవారం అయినా శుక్రవారం అయినా తప్పులేదు కాబట్టి ఎల్లరు నవరాత్రి తదనంతరం శుక్రవారం రోజున అనగా ఐదవ తారీకు రోజున గణపతి నిమజ్జనం చేయవలసిందిగా అన్ని గణేష్ ఉత్సవ మందిర కమిటీలకు విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version