పిల్లల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్య పునాది

పిల్లల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్య పునాది

మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్

కేసముద్రం/ నేటి ధాత్రి

సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో విలేజ్ కేసముద్రం లో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత-వెంకన్న

కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైందని, అందులోనూ ఫ్రీ ప్రైమరీ విద్య అనేది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టని అన్నారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న చిన్నారులకు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.

విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పిల్లల ప్రతిభను ప్రత్యేకంగా వీక్షించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వివేక్, ఎంపీడీవో క్రాంతి కుమారి, సిడిపిఓ శిరీష,కౌన్సిలర్స్ వేముల భారతి,కనుకుల సుభద్ర,వల్లందస్ ఉమా,మేకల శారద,రావుల వినయ్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version