పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆపదరాకుండా అందుబాటులో రెస్క్యు టీమ్ ఏర్పాటు

పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కడారి.సుస్మ

పరకాల,నేటిధాత్రి:

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణ శాఖ అందించిన సూచనల మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పురపాలక కార్యాలయం నుండి రెస్క్యు టీమ్ ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కడారి.సుష్మ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల క్రింది,అలాగే పురాతన శిధిల గృహలలో నివసించే వారు తమ ఇరుగు పొరుగు వారి గృహాలలోకి గాని బంధు మిత్రుల గృహాలలోకి గాని వెళ్లి ఉండాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా 9676166101,7100537570,9177557767,955062997,7386881788 గల నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version