పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version