ఝరాసంగం లో పర్యటించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

ఝరాసంగం లో పర్యటించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆-: ఝరాసంగం మండలం చిలమామిడి, జీర్లపల్లి, బొప్పన్పల్లి, కొల్లూరు,

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం,కుప్పానగర్ ,ఈదులపల్లి,చిల్కేపల్లి* గ్రామాలలో పర్యటించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ గారి సహకారంతో నియోజకవర్గ గ్రామాలు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం.మళ్లీ గ్రామలు అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిలను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు.ఎమ్మెల్యే గారితో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్ ,ముర్తుజా, దీపక్ , తదితరులు పాల్గొన్నారు.

రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన…

రైతులు పత్తి పంట నష్టంపై ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేంద్రంతో పాటు మండల పరిధిలోని జీర్లపల్లి ఈదులపల్లి దేవరంపల్లి ఎల్గోయి తుమనపల్లి గ్రామాల్లో రైతులు తమ పత్తి పంట నష్టం చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తక్షణ సహాయం అందజేయాలని వారు కోరుతున్నారు. పంట నష్టానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, రైతులకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version