*అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం…

*అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం

జన్మదిన సందర్భంగా రూ.5 వేల అందజేసిన యువ కాంగ్రెస్ నాయకుడు

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కూకట్ల కోమల (భర్త సాంబయ్య) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ తన జన్మదినోత్సవం సందర్భంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో మహ్మదాపురం, మర్రిపల్లి కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జి గోగుల ప్రకాష్ రెడ్డి, మర్రిపల్లి గ్రామ వార్డు సభ్యులు ఎరుకల పద్మ, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్, మహ్మదాపురం గ్రామ వార్డు సభ్యుడు పాలడుగుల ప్రశాంత్, మర్రిపల్లి మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్, నాయకులు భాషబోయిన సంజీవ, ఇట్టబోయిన ఐలయ్య, ఇనుముల రాము, ఆడెపు గోవర్ధన్, ఎలకంటి కుమారస్వామి, రాధారపు వనయ్య, చొప్పరి భాస్కర్, గాజు నాగరాజు, కుక్కమూడి రాజు, పొన్నాల మహిపాల్, అంబీరు శివాజీ, కన్నెబోయిన సురేష్, కుక్కమూడి చిరంజీవి, పాలడుగుల రాజుకుమార్, తలబోయిన సంపత్, కూకట్ల కట్టయ్య, గాజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ..

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ

మంగపేట, నేటిధాత్రి

 

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునిగాల వెంకటేశ్వర్లు శ్రీలత దంపతుల సహకారం తో ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని పలువురు వృద్ధులు, ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యం గా భావించి తమకు తోచినటువంటి సహాయం అందిస్తున్నామని ట్రAరా అనేక కార్యక్రమాలు మరియు సహాయసహకారాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ , ప్రచార కార్యదర్శి గగ్గురి మహేష్ , సభ్యులు గుంటక చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version