జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉచితంగా దుప్పట్ల పంపిణీ
మంగపేట, నేటిధాత్రి
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునిగాల వెంకటేశ్వర్లు శ్రీలత దంపతుల సహకారం తో ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని పలువురు వృద్ధులు, ఏ ఆధారం లేని అభాగ్యులకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యం గా భావించి తమకు తోచినటువంటి సహాయం అందిస్తున్నామని ట్రAరా అనేక కార్యక్రమాలు మరియు సహాయసహకారాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ , ప్రచార కార్యదర్శి గగ్గురి మహేష్ , సభ్యులు గుంటక చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
