ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన..

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సంపేట బ్రాంచ్ ఆఫీస్ ముందు ఎల్ఐసి ఏఓఐ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు,ఏజెంట్లు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపెళ్లి రాంనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి,నరేందర్,చంద్రమౌళి,సదానందం,రవీందర్,నర్సంపేట బ్రాంచి అధ్యక్షులు పొనుగొటీ సుధాకర్ రావు, నర్సంపేట బ్రాంచ్ సెక్రటరీ ఎండి సుభానుద్దీన్, జోనల్ నాయకులు మొద్దు రమేష్,గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాంబరాతి శ్రీనివాస్,కోశాధికారి కందికొండ రవికుమార్, క్లియర్ అధ్యక్షుడు ఆర్ చంద్రమౌళి ప్రచార కార్యదర్శి అల్లి రవి, డివిజన్ నాయకులు బూర రమేష్, చందు,అమృ, రఘుపతి, కుసుంబ బాబూరావు,కడారి వెంకటేశ్వర్ రావు,ఆనంతుల రమేష్ ముఖ్య సలహాదారుడు నాంపల్లి కొమురయ్య తదితర ఏజెంట్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version