చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు….

చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు

 

 

వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Chittoor Rains) కురుస్తున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల్లోనూ రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని నీవా నది లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కళాశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తోంది జిల్లా యంత్రాంగం. పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూరగాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

కాగా.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.

కిష్త్వార్ క్లౌడ్‌బర్స్ రక్షణ కార్యక్రమం నాలుగో రోజు..

కిష్త్వార్ జిల్లా చిసోటీ గ్రామంలో, ఆగస్టు 14న జరిగిన క్లౌడ్‌బర్స్ కారణంగా భారీ ఫ్లాష్ ఫ్లడ్‌లు చోటుచేసుకున్నాయి. 60 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మంది ఇంకా అదృశ్యంగా ఉన్నారు. 167 మంది గాయాలతో రక్షించబడ్డారు. ఫ్లాష్ ఫ్లడ్‌ల కారణంగా మార్కెట్, లంగర్ స్థలాలు, 16 ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, 3 ఆలయాలు, 4 వాటర్ మిల్స్, 30 మీటర్ల పొడవైన వంతెన, పలు వాహనాలు నశించాయి.
సమగ్ర రక్షణ చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, BRO, పోలీస్, స్థానిక వాలంటీర్లు పాల్గొని, రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. 17 మీటర్ల బ్రీడ్జ్ నిర్మాణం జరుగుతూ, రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. బాధితులకు ఆహారం, మందులు, మరియు ఇతర సహాయాలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. Machail Mata యాత్ర నాలుగో రోజు కూడా నిలిపివేయబడింది.

జమ్ము & కాశ్మీర్‌లో గంటలలో రెండు క్లౌడ్‌బర్స్.

జమ్ము & కాశ్మీర్‌లో రెండు వేర్వేరు క్లౌడ్‌బర్స్ శనివారం మరియు ఆదివారం రాత్రిలో చోటుచేసుకున్నాయి. జోధ్ ఘాటీ గ్రామంలో ఐదు మంది, జాంగ్లోటే ప్రాంతంలో వర్షాల కారణంగా భూకంపంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మినహాయింపులు భారీ నష్టం ఏర్పడింది.
క్లౌడ్‌బర్స్ అనేది చిన్న ప్రాంతంలో హఠాత్, తీవ్రమైన వర్షం, ఫ్లాష్ ఫ్లడ్‌లు, ల్యాండ్స్లైడ్స్ మరియు మౌంటైన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాలకు దారి తీస్తుంది. సాధారణంగా 1 కిమీ³ వాల్యూమ్ ఉన్న క్యూములోనింబస్ మేఘం 500 మిలియన్ లీటర్ల నీరు నిల్వ చేయగలదు. వర్షం అత్యంత స్థానికంగా పడుతుంది, కొన్ని గంటల్లోనే భారీ నష్టం కలిగిస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version