నల్గొండ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ ప్రారంభించిన: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

నల్గొండ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ ప్రారంభించిన: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

చిలుకూరు, నేటిధాత్రి:

మండల కేంద్రం లో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య శాఖను ఏర్పాటు చేశారు. సోమవారం శాఖను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలుకూరు మండల కేంద్రంలో శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఈ బ్యాంకు ద్వారా ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు లాభం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ బ్యాంకు ద్వారా లభించే రుణాలు ఇతర ఆర్థిక సేవలు నేరుగా రైతులకు చేరడం వల్ల వారికి సాగు పనుల్లో వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మనాగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పెండ్రాతి హనుమంతరావు, ఎడవల్లి పుల్లారావు, బ్యాంకు ఉన్నతాధికారులు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం…

రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం

రైతుల పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలి

మోంథా తుఫాన్ తో తీవ్రతతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/bbeqTKMJ98U?si=smzHOjoihBFgUTZq

 

అధిక వర్షాలు, మోంథా తుఫాన్, యూరియా కొరతలతో పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని తక్షణమే అట్టి నోటీసులను ఉపసంహరించుకొని పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుల వ్యవసాయం అధిక వర్షాలు యూరియా కొరతతో అస్తవ్యస్తంగా మారిందని, పంటల దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో అరాకోరా పంటలు చేతికచ్చే దశలో మోంథా తుఫాన్ తో ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాలలో పత్తి మొక్కజొన్న వరి తదితర పంటలు కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి సురేఖ,నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి
అదుపోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, డివిజన్ నాయకులు జన్ను రమేష్ ముర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version