గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్..

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నిబంధనల ప్రకారం నిర్వహించాలని వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ పెబ్బేరు మండలంలోని రంగాపూర్, సూగూరు, జనుంపల్లి మరియు శాఖాపురం క్లస్టర్లను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియ పూర్తయిన వెంటనే, నిర్ణీత గడువులోగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పెబ్బేరు తహసీల్దార్ మురళి క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు

నామినేషన్ ప్రక్రియపై కలెక్టర్ ఆదేశాలు

నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి,సూరారం గ్రామాలకు గుల్లకోట గ్రామపంచాయతీ, పోతపల్లి,అంకతిపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలకు పోతపల్లి గ్రామపంచాయతీ,చందారం, హనుమంతుపల్లి,రంగపేట గ్రామాలకు చందారం గ్రామపంచాయతీలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని,ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్,816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని,నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించకూడదని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు,ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన,గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.అనంతరం ఇటిక్యాల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పోస్ట్ మార్టం గది నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు,సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version