గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నిబంధనల ప్రకారం నిర్వహించాలని వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ పెబ్బేరు మండలంలోని రంగాపూర్, సూగూరు, జనుంపల్లి మరియు శాఖాపురం క్లస్టర్లను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియ పూర్తయిన వెంటనే, నిర్ణీత గడువులోగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పెబ్బేరు తహసీల్దార్ మురళి క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు
