ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న డిసిసి ఉపాధ్యక్షులు జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిసిసి ఉపాధ్యక్షులు & సోదరుడు మహమ్మద్ ముల్తానీ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాచనూర్ గ్రామ స్థానిక వద్ద స్టేజీ ఏర్పాటు చేసి బాణాసంచా కాల్చి, బారి గజ మాలను మహమ్మద్ ముల్తానీకు అలంకరించి, ఆయనతో కేక్ కట్ చేయించి, శాలువా పూలమాలలతో సన్మానించి వేడుకలు ఘనంగా నిర్వహించారపటేల ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రటరీ మహేందర్ పటేల్, అశ్విన్ పటేల్, మొహమ్మద్ ఖదీర్, షేక్ ఖాయుమ్,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం…!

◆:- ” డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించడం ఖాయమని డీసీసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని, విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి మద్దతుగా షేక్ పేట్ డివిజన్ లోని 67 బూత్ నెంబర్ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 67వ బూత్ ఇంచార్జి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్దాం. ఉజ్వల్ రెడ్డి, ఆదేశాల మేరకు షేక్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తూ.. సంగారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి. ముల్తాని మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుస్తారు. కాంగ్రెస్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు మద్దతు ఇస్తున్నారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కుడ కనిపించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో జూబ్లీహిల్స్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికీ మరో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు. జూబ్లీహిల్స్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ స్విప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిదంగా కేవలం షేక్ డివిజన్ కీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటికే 95 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు గెలిపియడానికి సిద్దంగా వున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో జహీరాబాద్ నియోజకవర్గంకు చెందిన మాజీ ఎంపీటీసీ మహేందర్, ఆఫీస్, మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి, ఝరాసంగం మండల యువ నాయకులు అభిలాష్ రెడ్డి, న్యాల్కల్ మండల ఆశభావ జడ్పీటీసీ అభ్యర్థి మొహమ్మద్ యూనూస్, అశ్విన్, తదితరులు స్థానికలు పాల్గొన్నారు.

అలాగే సన్నీ ను పరమర్శించిన డీసీసీ ఉపాధ్యక్షులు…

అలాగే సన్నీ ను పరమర్శించిన డీసీసీ ఉపాధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల మాచునూర్ గ్రామ యువకుడు అలాగే సన్నీ, ఎస్ 3 ఆసుపత్రి జహీరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకొంటున్న సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి.ముల్తాని, తమ బృందాతో కాంగ్రెస్ నాయకులతో కలసి పరామర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ లతో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని సూచించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version