నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి _రాజా రమేష్, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ల 22 మంది కౌన్సిలర్లను రామకృష్ణాపూర్ పట్టణ బి జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. బీజోన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి రజక సంఘం నాయకులు సన్మానించడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో మునిసిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకెళ్తామని మునిసిపాలిటీ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, రామిడి కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఎస్ ఆర్ కె పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య, రజక సంఘం సభ్యులు పున్నం, కంచర్ల శ్రీనివాస్, మల్లయ్య, రాంబాబు, నాగరాజు, రాజేశ్వరి, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version