గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పోలీసు వారికి వచ్చిన నమ్మదగిన సమాచారంతో మందమర్రి అంగడి బజార్ ,శివాలయం రోడ్ లో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ సమీరుద్దీన్ అలియాస్ సమీర్ ,తండ్రి యూసఫ్ ఉద్దీన్ , వయసు: 21 సం, నివాసం: అంగడి బజార్, మందమర్రి లోఈ రోజున అరెస్టు చేశారు. మందమర్రి ఎస్సై జి నరేష్ గారు నేరస్తుని వద్ద నుంచి 165 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి తదుపరిచర్యకై నేరస్థున్ని అదుపులోనికి తీసుకోవడం జరిగింది అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో మందమర్రి పోలీస్ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.
