అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనపల్లి.టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ సర్పంచ్ గడ్డం మధుకర్ చోటు. అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా గ్రామంలో గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిపించి న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి గ్రామంలో ఉన్న అవసరాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలనిఅధ్యక్షుల వారికి తెలియజేస్తూ వారిని కలవడం జరిగింది అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మా విజయానికి సంబంధించి మాకు గెలవడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి తెలియజేస్తూ. అధ్యక్షులును కలవడంతో పాటు రాబోయే రోజులలో మా గ్రామ సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి అభివృద్ధి పరచాలని అధ్యక్షులకు. తెలియజేయడంతో పాటు మమ్మల్ని దీవించి గ్రామ అభివృద్ధిలో మీ చేయూతని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు
