పెరుమాళ్ళపల్లిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవం…

*పెరుమాళ్ళపల్లిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవం…

*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న…

*తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…

తిరుపతి రూరల్(నేటిధాత్రి:

తిరుపతి రూరల్ పెరుమాళ్ళపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెరుమాళ్ళపల్లి గ్రామ ప్రజల ఐక్యతతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు దిగ్విజయంగా జరపడం సంతోషకరమన్నారు.
లోక కల్యాణం కోసం, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తుడా ఛైర్మన్ కి గ్రామ పెద్దలు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం గ్రామస్తులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.
ఈ మహోత్సవంలో పెరుమాళ్ళపల్లి గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు

మెట్ పల్లి ఏప్రిల్ 30 నేటి దాత్రి

లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు మహాజన్ నరసింహులు వివాహ మహోత్సవం సందర్బంగా
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు లయన్స్ మహాజన్ నర్సింలు వ్యవసాయ మార్కెట్ వచ్చినా రైతులకు మరియుఅమాలి జాడు కార్మికులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
అనంతరం ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ లయన్స్ సభ్యుల పెళ్లిరోజు పుట్టినరోజు కార్యక్రమాలకు అన్నప్రసాద కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమని అది వ్యవసాయ మార్కెట్లో రైతులకు అమాలీలకు జాడు కార్మికులకు లయన్స్ క్లబ్ ద్వారా అన్న ప్రసాద వితరణ చేయడం మంచి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుందని అన్నారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాసరావు మాట్లాడుతూ లయన్స్ మెట్పల్లి వారు సేవా కార్యక్రమంలో రాష్ట్రంలోనేమొదటి ర్యాంకులో ఉన్నదని అలాగే
అన్నా ప్రసాద కార్యక్రమాలు కాకుండా ఈ సంవత్సరం12 కంటి వైద్య శిబిరం గుండె ఉచిత వైద్య శిబిరం క్యాన్సర్ శిబిరం అలాగే చలికాలంలో పేదలకు అలాగే బిక్షటన చేస్తున్న వారికిదుప్పటి పంపిణీ ఎండాకాలంలో అంబ్రెల్లర్స్ రోడ్లపై పనులు చేస్తున్న వారికి పంపిణీ చేయడం వేసవికాలంలో చలివేంద్రం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెల్ముల శ్రీనివాస్ రావు మహాజన్ నరసింహులు ఏఎంసీ డైట్ డైరెక్టర్ పుల్లూరి నవీన్ కోట విజయ్ కుమార్ ఏఎంసీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రం శoకర్ గుంజ్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం నుండి శుక్రవారం వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ దాచ శివ న్యాయవాది దార వెంకటేష్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ ఈపూరి వెంకటేష్ ఆలయ పురోహితులు వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఉదయం 8 గంటల నుండి అభిషేకం మంత్రపుష్పం ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహ సహస్ర నామ లక్ష పుష్పార్చన మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉదయం 10 . 45 నుండి ప్రారంభం అనంతరం తీర్థప్రసాదాలు అన్న ప్రసాదం ఉంటుందని వారు పేర్కొన్నారు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ స్వామి వారి ఊరేగింపు పల్లకి సేవ ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృప కు పాత్రలు కావాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version