పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి…

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ తెలిపారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలో గల మురికిని తీసేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు నేపథ్యంలో.. వ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాత్రిపూట దోమలకు పొగ వెయ్యడం జరుగుతుందన్నారు.

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం…

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్, జిల్లా పశు వైద్య గణనభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మణికుమార్ మాట్లాడుతూ.. గర్భ కోశ వ్యాధి నివారణ వ్యాధి టీకాలు రైతులు పశువులకు వేయించాలన్నారు. 90 రోజుల ఎద లక్షణాలను గుర్తించి గోపాల మిత్ర ద్వారా కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు. 15 రోజుల తర్వాత ఆరు నెలల వరకు నట్ట నివారణ మందులు వాడాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version