జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

◆-: పట్టణంలో రహదారుల విస్తూర్ణం మారబోతున్న జహీరాబాద్ రూపురేఖలు

 

మాస్టర్లోన్తో మారనున్న పట్టణ రూపురేఖలు అమృత్ 2.0 నిధులతో రోడ్లు, నాలాల విస్తరణకు కార్యాచరణ మున్సిపల్ యంత్రాంగం సిద్ధం.. ఈ ఏడాది పూర్తిచేయాలని లక్ష్యం

జహీరాబాద్, నేటి ధాత్రి:

ఏడు దశాబ్దాల చరిత్ర కలి గిన జహీరాబాద్ పట్టణం అన్ని రంగాల్లో విస్తరిస్తున్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. పట్టణం 12 వార్డుల నుంచి 37 వార్డులకు చేరు కుని, 21.13 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినా, దశాబ్దాల క్రితం నాటి ఇరుకైన రోడ్లే ఉండటంతో నేటికీ ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కార ణంగా మారుతున్నాయి. ఏ రోడ్డు చూసినా ఇరుకుగా ఉండటం, నిర్మాణాలు, సెబ్బ్యాక్ లు లేని రోడ్లపైనే పార్కింగ్లు.. వెరసి వాహనదారులకు, స్థానికులకు నిత్యం నరకప్రాయంగా మారింది. అయితే, తాజాగా అమృత్ 2.0 పథకం జహీరాబాద్ అభివృద్ధికి కొత్త ఆశలను చిగు రింపజేస్తోంది.

అమృత్ 2.0తో అభివృద్ధి వేగం

పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2021 లోనే అమృత్ 20 పథకం కింద రూ.18 కోట్ల నిధు లను మంజూరు చేసింది. పలు కారణాల వల్ల

ప్రజల సహకారం అవసరం

జహీరాబాద్ అభివృద్ధికి మాస్టర్న్ అత్య వసరం. ఇది పూర్తిస్థాయిలో అమలైతే జహీరా బాద్ రూపురేఖలు మారి అద్భుతంగా అభి వృద్ధి చెందుతుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలను చెల్లించి ప్రజలు అభివృద్ధికి సహకరించాలి.

– జైత్రం నాయక్, మున్సిపల్ కమిషనర్-జహీరాబాద్

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం

ఆలస్యమైనా 2023 నుంచి అధికారులు ఈ ప్రాజెక్టును వేగవంతం చేశారు. ఈ పథకం ద్వారా రోడ్ల వెడల్పు, మాస్టర్న్ అమలు, మంచి నీటి సర ఫరా, అండర్ గ్రౌండ్ డైక్రేజీ వ్యవస్థ, ప్రభుత్వ భూముల్లో కార్యాలయాల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి 2026 మార్చి గడువుగా ఉంది. దీని కోసం మొత్తం 24 శాఖల నుంచి సమాచారం సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 13 శాఖల నుంచి డేటాను అధికారులు సేకరించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ, కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో పక్కాగా అమలు చేయా లని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేనిపక్షంలో యంత్రాంగమే కూల్చివేతలకు సిద్ధమని అధికా రులు హెచ్చరిస్తున్నారు. మాస్టర్హౌన్ పూర్తిగా అమలయితే జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తా మని పేర్కొంటున్నారు.

ప్రాధాన్యత క్రమంలో రోడ్ల విస్తరణ

పట్టణంలో ఉన్న 15 ఇరుకైన రోడ్లను అధికా రులు గుర్తించగా, ఇందులో ఐదు రోడ్లను

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని చెన్నూర్  మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని,ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.చెన్నూర్ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు.స్థానిక ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అమృత్ 2.0 పథకం కింద పట్టణంలో చేపట్టి కొనసాగుతున్న నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి  చేసే విధంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version