రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ
తిరుపతి(నేటి ధాత్రి) మే 26:
శ్రీపద్మావతి మహిళా డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసామని శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినులకు 28 ఏప్రిల్ నుండి 9 మే 2025 వరకు జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తిని సాధించి ఈ పరీక్షలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్య నిర్వాహణాధికారి కి, సంయుక్త కార్య నిర్వాహణాధికారి కి, విద్యాశాఖాధికారి కి, సంబంధిత విభాగాధికారులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలలో 92 శాతం విద్యార్థినిలు ఉత్తీర్ణతను సాధించారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. విద్యుల్లత తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరిండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ మెంబెర్స్ జి సుధాకర, చంద్రశేఖర్, సంధ్య మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు..