సిరిసిల్ల జిల్లా లో ప్రజావాణి
అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీ ఎస్ఎల్ ఏ, డీఈఓ కు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, ఎంపీడీఓ బోయినపల్లి కి రెండు చొప్పున ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్ లూమ్స్, సీపీఓ కి ఒకటి చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.