నర్సంపేట,నేటిధాత్రి :
ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరచిన విధంగా హామీలు నెరవేర్చాలని కోరుతూ
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సంపేట ఉద్యమకారుల ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకురాలు దార్ల రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల సంఘం డివిజన్ నాయకులు నరసయ్య గౌడ్,మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, బైరి తిరుపతిరెడ్డి,బోళ్ల స్వామి,పులిగిల్ల యాదగిరి,పలనాడు సాంబయ్య,దుగ్గి రాజు,వేల్పుల సురేష్, గాన్లోజ్ భాస్కర్,బోనాల రవి, పెండ్యాల కృష్ణ, దార్ల చంద్రమ్మ, రచ్చ రఘు,పొన్నం రజిత,మిడిద రవి,వాసం సాంబయ్య,వడ్లపెల్లి శ్రీనివాస్,దొంగల సురేష్, బోనాల రవి పాల్గొన్నారు.