భూ భారతి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.

To this extent, Bachuraj Palli, Nizampet Mandal To this extent, Bachuraj Palli, Nizampet Mandal

— భూ భారతి లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
• ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
• తహసిల్దార్ శ్రీనివాసులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని మండల తాహసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో తమ గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యల పరిష్కారానికి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండల స్థాయి సమస్యలను మండల స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సులో ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులు గ్రామంలో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ రమ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ధరణి ఆపరేటర్ రాజు, సిబ్బంది కళ్యాణ్, నవీన్, గ్రామ ప్రజలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!