రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

Examine land issues. Examine land issues.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ రజిత

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను పరిశీలించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం భూమి ఎక్కువ తక్కువ ఉన్న, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న

భూ సమస్యలు, సర్వే నంబర్ లేకపోవడం, పట్టా పాస్ బుక్ లు లేకపోవడం, ఒక్కరి భూమి మరొకరి మీద పట్టాకు ఎక్కినటువంటి సర్వే నంబర్లను సరిచేసి పాత రికార్డు ప్రకారం పరిశీలించి సరి చేయడం సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో టి టిపి సి సి నెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, ఇల్లంతకుంట టెంపుల్ ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, యూత్ నాయకులు హరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, బండి మహేష్, అనిల్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!