మద్యం కోసం తాకట్లు….
◆ రూపాయిలు. 200 రూపాయిలు . 2000 వసూలు!
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వింత దోపిడీ జరుగుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు తమ వద్ద డబ్బులు లేకపోతే వాచ్లు, చైన్లు, ఉంగరాలు, మొబైల్ ఫోన్లను తాకట్టుపెడుతున్నారు. అయితే, రెండు రోజుల్లో వాటిని విడిపిం చుకోకపోతే, రూ. 200 విలువైన మద్యం కోసం తాకట్టు పెట్టిన వస్తువుకు ఏకంగా రూ. 2000 డిమాండ్ చేస్తున్నారు. వైన్స్ షాపులకు అనుబంధంగా ఉన్న స్నాక్స్ షాపులు, ఇతర దుకాణాల్లో ఈ తరహా దోపిడీ ఎక్కువగా జరుగుతోందనే ఆరోప ణలు ఉన్నాయి. వైన్స్ పర్మిట్ రూముల్లో కూర్చుని మద్యం తాగిన తర్వాత, మరికొంత మద్యం తాగేందుకు డబ్బులు లేని వారు తమ వస్తువులను తాకట్టు పెడుతున్నారు. మరుసటి రోజు వాటిని విడిపించుకోవడానికి వెళ్లే వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైన్స్ దుకాణదారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది.
అబ్కారీ సీఐ ఏమన్నారంటే..

వైన్స్ దుకాణాల్లో నగదు లేదా పేటీఎం ద్వారామాత్రమే మద్యం విక్రయించాలని జహీరాబాద్ అబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైన్లో గానీ, వాటికి అనుబంధంగా ఉన్న షాపుల్లో గానీ వస్తు వులు తాకట్టు పెట్టుకుని మద్యం ఇచ్చిన ట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.