లాభాల్లో పాకాల మహిళా బ్యాంక్
ఘనంగా పాకాల మహిళా బ్యాంక్ 24 వార్షిక మహాసభ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పాకాల మహిళా బ్యాంక్ 25 లక్షల 50వేల లాభం అర్జించిందని పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండం రాజేశ్వరి తెలిపారు.శాంతినగర్ లోని మహిళా బ్యాంక్ కార్యాలయంలో 24 వార్షిక మహాసభ ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాక్స్ సొసైటీ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ2024-25 సంవత్సరానికి గాను డిపాజిట్లు రెండు కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మహిళ బ్యాంక్ 236 సంఘాలు మరియు బృందాలతో ఆర్థిక అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతున్నట్లు తెలిపారు. 3000 పైచిలుకుల సభ్యులు గల సంఘంలో పాడి గేదె రుణాలు, వ్యాపార రుణాలతో పాటు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ కోశాధికారి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధ, గండు శ్రీదేవి,గాధగోని నిర్మల, రాపాక మాణిక్యం, మండల పద్మ, దేవులపల్లి వాణి,గుడిశాల వనజ, బొమ్మగాని మంజుల, గొడిశాల రజిత ,లీగల్ అడ్వైజర్ పెండెం శివానంద్ సిబ్బంది కీసరి విజయ, పాకాల రంజిత్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.