
కార్మిక, కర్షక గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఫిబ్రవరి 16 తారీకున గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం గుండాల మండలం శంబునిగుడేం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులను,కర్షకులను అణచివేసి బడా పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని అప్పగించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని…