తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహం!

`తెలంగాణ యాసకు పాటలమ్మ పరవశం.

`తెలంగాణ కావ్యాలకు సంగీతమే సాగరం!

`తెలంగాణ మట్టి పరిమళాలతో రాగమాడుతున్న తాండవం.

`తెలంగాణ ఉద్యమంతో పల్లె పాటకు పెరిగిన ఆదరణ.

`ఆది నుంచి తెలంగాణ పాటలో వున్న మట్టి వాసన.

`తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం.

`ప్రపంచం నలుమూలలా పాకుతున్న పాటల విన్యాసం.

`మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలు వారిన ముత్యాల వాన.

`రాను బొంబయ్‌కి రాను అంటూ ఊగిపోతున్న ప్రపంచం.

`అర్థం తెలియకపోయినా అల్లుకుపోతున్న పాట.

`వందల మిలియన్లతో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ పాట.

`ఒకప్పుడు తెలంగాణ పాటకు అవమానం.

`ఇప్పుడు తెలంగాణ పాటకు వైభోగం.

`తెలంగాణ పాట రాష్ట్రానికే సౌభాగ్యం.

`మనసు పరవశానికి పట్టాభిషేకం.

`ఆనందాన్ని పంచుతున్న ఆరోగ్యం.

`వెలుగులోకి వస్తున్న సంగీత సరస్వతులకు జేజేలు కొడుతున్న ప్రపంచం.

`ఎన్ని సార్లు విన్నా తరగనంత సంతోషాన్ని నింపుతున్న మధురగానం.

`అది తెలంగాణ యాసలో వున్న మధురామృతం.

`ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ విన్నా సినిమా పాటలు.

`ఇప్పుడు ప్రపంచమంతా మారు మ్రోగిపోతున్న తెలంగాణ పాటలు.

`తెలంగాణ యాస కమ్మదనం తొక్కుతున్న పాటల పరవళ్లు.

`తెలంగాణ కవిగాయకులు అంటే పాటల ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణపాట అనగానే మది పులకిస్తుంది. మనసు పరవశిస్తుంది. తెలంగాణ పాట అంటేనే రక్తం ఉరకలేస్తుంది. ఊపును నింపుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. వ్యవస్ధను నిలదీస్తుంది. సమాజాన్ని దారిలో పెడుతుంది. ఆలోచనను సృష్టిస్తుంది. నిజాన్ని వెలికి తీస్తుంది. నిప్పులా కాలుతుంది. సూటిగా బాణంగా గుచ్చుకుంటుంది. తూటాలా పేలుతుంది. మస్కిష్కంలోకి దూసుకుపోతోంది. ఆలోచింపచేస్తుంది. చైతన్యం నింపుతుంది. ఉద్యమానికి ఊపిరిలూదుతుంది. పోరాటానికి దారి చూపిస్తుంది. ప్రకృతిని ఆరాదిస్తుంది. ప్రకృతి గొప్పదనం చెప్పుతుంది. గాలి, నీరు, నిప్పు, నింగి,నేలను కలుపుకొని సాగుతుంది. ఉప్పెనలా దూసుకొస్తుంది. సునామీ సృష్టిస్తుంది. గడ్డిపరకలు గడ్డపారలౌతాయి. ఎండిన ఆకులు కూడా అలజడులు సృష్టిస్తాయి. వాగులు పరుగులందుకుంటాయి. వంకలు దుంకుతుంటాయి. కొండ, కోనలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయి. ఇదీ తెలంగాణ పాటంటే…ఇదే తెలంగాణ గానమంటే..ఆ గానంలో ఆత్రం వుంటుంది. ఆకలి వుంటుంది. తిరుగుబాటు వుంటుంది. కమ్మదనం వుంటుంది. అందుకే తెలంగాణ పాటకు దాసోహం అనని వారుండదు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటే శివుడు కూడా కన్నీరు కార్చాల్సిందే. ఆ కన్నీటితో శివలింగం కూడా తడిసి ముద్ద కావాల్సిందే. ఆ కన్నీటితోనే అభిషేకం జరిపిన పాట తెలంగాణ పాట. అవును ఇది అతిశయోక్తి కాదు. ఆర్తి. తెలంగాణస్పూర్తి. తెలంగాణ పదానికి దేవుళ్లే కదిలిన దార్తి…తెలంగాణ ఉద్యమ కాలంలో మిట్టపల్లి సురేందర్‌ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ పాట రాస్తే, ఆ రాగానికి తెలంగాణ మొత్తం కన్నీటిపర్యంతమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కండ్ల ముందు కదలాడిరది. ఏకంగా శివుణ్ణే ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజమంతా నివ్వెరపోయింది. తెలంగాణ ఇస్తారా? లేదా? అని డిల్లీని నిలదీసింది. కొట్లాడి సాదించుకుందామనే ధైర్యాన్ని ఆ పాట తెలంగాణ యువతలో నింపింది. అదీ తెలంగాణ పాట గొప్పదనం. తెలంగాణ పాట ఇప్పుడు పుట్టింది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణలో బతుకమ్మ పుట్టినప్పుడే పాట పుట్టింది. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పాట గళమెత్తింది. తెలంగాణ ఉద్యమం కోసం రెండు దఫాలుగా యాభై ఏళ్లపాటు ప్రతిసారి పాటల రెక్కలు కత్తిరించినా, కొత్త రెక్కలు తొడుక్కొని ఊరకలెత్తింది. ఈ భూమి మనదిరా.. వాడ మనది రా..అంటే చైతన్యం నింపింది. ఎంతో మంది కవి గాయకులు తెలంగాణను పాటల సీమగా మలిచారు. ఇప్పుడు స్వర్గసీమను ఏలుతున్నారు. ప్రజల నాలుకలమీద జీవిస్తూనే వున్నారు. అలా ఎంతో మంది కవులు,గాయకులు తెలంగాణ గడ్డ మీద పుట్టారు. అయితే తెలంగాణ పాటను తమ స్వార్ధం కోసం వాడుకున్న ఆంద్రులున్నారు. వారి రాజకీయం కోసం అణిచి వేసిన వాళ్లున్నారు. సినిమా వాళ్లు తెలంగాణ పాటతో కోటీశ్వరులయ్యారు. కాని తెలంగాణ కవులకు చిల్లిగవ్వలు ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ పాటను రాజకీయ నాయకులు అణిచివేశారు. అయినా ఆకలిని కూడా ఎదరించి నిలబడిరది తెలంగాణ పాట. ఆకలికి అమ్ముడుపోనిది తెలంగాణ పాట. ఎవరో వేసే మెతుకుల కోసం ఆరాటపడనిదే తెలంగాణ పాట. తనను తాను సృష్టించుకొని పల్లకిలో ఊరేగిందే తెలంగాణ పాట. ఆ పాటల పరంపరంలో ఉద్యమానికి ఊపిరులూదిన పాటలు అనేకం వున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద అంటూ గద్దర్‌ పాడిన పాటలు, జయయజహే తెలంగాణ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాటలున్నాయి. నేలమ్మ నేలమ్మా అంటూ జయరాజ్‌ రాసిన పాటలున్నాయి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అంటూ తెలంగాణను మేలుకొలిపిన పాటలున్నాయి. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అని వినిపించిన గానాలున్నాయి. ఇదవన్నీ తెలంగాణకు ముందు…కాని ఇప్పుడు తెలంగాణ తర్వాత కూడా తెలంగాణ పాట తన ప్రస్ధానం ఆపుకోలేదు. ఆగిపోలేదు. మరింత దూకుడు పెంచింది. అందుకే తెలంగాణ పాట గురించి చెప్పాలంటే తెలంగాణ రాకకు ముందు, తెలంగాణ తర్వాత అని చెప్పాలి. అప్పటి పాటలు ఆణిముత్యాలు. ఇప్పటి పాటలు ప్రపంచాన్ని ఏలుతున్న వజ్రాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాటల పూదోట. అది ఎరుపెక్కినా పాట ద్వనిస్తుంది. పచ్చగా మారినా పరవశించి పాడుతుంది. ఉద్యమాల బాటకు దారులు వేసిన పాట. పోరాటాలను కడుపులో నింపుకొని దూకిన పాట. తెలంగాణ పాట అంటేనే పోరాటాల చరిత్ర. అణివేతను నిలదీసిన తిరుగుబాటు. అస్ధిత్వ ఆరాటాన్ని, ఆత్మ గౌరవ నినాదాన్ని నింపుకొని సాగుతుంది. పాట హృద్యంగా వుండాలన్నా, రక్తం మరగాలన్నా తెలంగాణ పాటేకావాలి. ఇది తెలంగాణ పాట గొప్పదనం. నిండు గుణం. ఒకప్పుడు తెలంగాన పాటంటే పౌరుషం..పోరాటం మాత్రమే అనుకునే వారు. కాని దాని వెనుకున్న ఆకలి ఆరాటాలు పట్టించుకునేవారు కాదు. తెలంగాణ పాటలో తిరుగుబాటు బావుటానే చూసేవారు. కాని అది గుండెల్లో మండుతున్న అగ్నికి ప్రతిరూపం అని పాలకులు భావించకపోయేవారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు అని తెలుసుకోలేకపోయారు. వాటిని అణిచి వేశారు. పాటను కాలరాయాలనుకున్నారు. ఆనాడే తెలంగాణ పాటకు స్వేచ్చనిస్తే ప్రపంచాన్నే శాసించేది. ప్రపంచానికే చైతన్యాన్ని నింపేది. తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆ పాటలు సజీవమే..కాని తెలంగాణలో ఇప్పుడు కొత్త తరంపాటలొస్తున్నాయి. రసరంజనిలో ఓలలాడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గుండెలో ఆనందాన్ని నింపుతున్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ముసలీ ముతక కూడా కాలు కదిపేలా చేస్తున్నాయి. పసి పిల్లలు తొట్టెలో కూడా కూడా ఊగిపోయేలా చేస్తున్నాయి. తెలంగాణలో కన్నీటి పాటల నుంచి పన్నీటి పాటలు ఉధ్భవిస్తున్నాయి. పాటల జడివానలో ప్రపంచాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహమంటోంది. తెలంగాణ యాస ప్రపంచపు అంచులను తాకుతుంటే పాటలమ్మ పరవశించిపోతోంది. తెలంగాణ కావ్వాలకు సంగీత సాగరమే నాట్యం చేస్తోంది. తెలంగాణ మట్టి పరమిళలాతో రాగమే తాండవమాడుతోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే తెలంగాణకు చెందిన ఓ కుర్ర కళాకారుడు రాము రాథోడ్‌ గాయకుడై, కవిjైు, నర్తించి నిర్మించిన రాను..నే..రాను బొంబైకి రాను అనే పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మైకెల్‌ జాక్సన్‌ పాట కూడా 500 మిలియన్లు దాటిన సందర్భం లేదు. దేశంలోని ఏ గాయకుడు పాడిన పాట కూడా అంత దూరం వెళ్లలేదు. ఎంత పెద్ద పాటైనా సరే పది కోట్లు దాటడడమే ఒకప్పుడు రికార్డు. కాని ప్రపంచంలోని తెలుగు వాళ్లే కాదు, బాష తెలియని వాళ్లు కూడా ఆ బాణీలకు, మాటలకు ఫిదా అయిపోయారు. 50 కోట్ల మంది వీక్షించారు. తన్మయత్వానికి లోనయ్యారు. అంటే మాటలు కాదు. మామూలు విషయం అసలే కాదు. తెలంగాణ యాసలో ఈ మధ్య వస్తున్న అనేక పాటలు కూడా అదే దారిలో పరుగులు తీస్తున్నాయి. ఓ పిలగ వెంకటేష అంటూ సాగుతున్న పాట, దారి పొంట వత్తుండు..దవ్వ దవ్వ వత్తుండు..దారిదుద్దునా, పోనిద్దునా? అంటూ సాగే పాట కూడా ప్రపంచాన్ని జయించాలని పరుగులు పెడుతోంది. ఇలా రోజు రోజుకూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ యాసను దిగంతాలకు చేర్చుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను చీదరించుకున్న వాళ్లు, ఈసడిరచుకున్న వాళ్లు సైతం ఆ మాధుర్యానికి గులాములౌతున్నారు. తామెందుకు చేయలేమని ఆంద్రాకు చెందిన వాళ్లు కూడా తెలంగాణ యాసలో పాటలు రాస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ బాషను అదేం బాష.. అనేవారు. తెలంగాణ నుడి కారాలను వెక్కిరించేవారు. తెలంగాణ నుంచి వచ్చే సాహిత్యాన్ని చిన్న చూపు చూసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటకు ఆదరణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరుగుతోంది. మిస్‌ వరల్డ్‌ నోటి నుంచి జాలువారిని ముత్యాల వాన రాను..నే రాను బొంబైకి రాను..! అర్ధం తెలియకపోయినా తెలంగాణ పాట అల్లుకుపోతోంది. అందరి నాలుకల మీద నాట్యం చేస్తోంది. తెలంగాణ పాట ఇప్పుడు వైబోగం చవి చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి మనిషిలో వున్న పరవశానికే పదనిసలు నేర్పుతోంది. ప్రపంచమంతా పట్టాభిషేకం చేస్తుంటే తెలంగాణ యాస మధురగానంలో ఓలలాడుతోంది. పాటల పరవళ్లు తొక్కుతులంటే తెలంగాణ కళాకారులు సంగీత ప్రపంచంలో రారాజులౌతున్నారు. తమ రాజ్యాలనేలుతున్నారు. ఆల్‌ ది బెస్ట్‌. మైడియర్‌ న్యూ జనరేషన్‌.

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి.
రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం.
పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు.
భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది.
మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి.
కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని.
కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్లలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

Vaibhavalaxmi Shopping Mall

 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్‌ను డి-అడిక్షన్/రిహాబిలిటేషన్ సెంటర్‌, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు..ఈ సందర్భంగా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ గౌరవ సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి.పి.నీరజ మార్గదర్శకత్వంలో, DM&HO శ్రీమతి.రజిత సమన్వయంతో మరియు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ.గీతే మహేష్ బాబాసాహెబ్ గారి అనుమతితో న్యాయ సహాయ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతోజు భాస్కర్, లోక్ అదాలత్ సభ్యులు, .ప్రవీణ్, మానసిక వైద్య నిపుణులు, మణివర్మ, మెడికల్ ఆఫీసర్, ఈ. స్వాతి, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని అన్నారు ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి.నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షి కి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ, ఉమామహేశ్వరావు, కార్యాలయం ఏవో, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్ ,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం వైఎస్ఆర్ సీపీ నేతల పూజ

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కావాలని 516 కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్ సీపీ నేతలు

పాకాల(నేటి ధాత్రి)అక్టోబర్ :07

Vaibhavalaxmi Shopping Mall

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి’కి త్వరగా బెయిల్ మంజూరు కావాలని,ఆరోగ్యం బాగుండాలని పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వామికి పూజ చేసి 516 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట అర్చన చేయించి,ప్రత్యేక పూజలు నిర్వహించారుచెవిరెడ్డి అక్రమ నిర్భంధానికి 112 రోజులని,చెవిరెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాకాల మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

ఓటు చోరు – గద్ది చోడ్….

ఓటు చోరు – గద్ది చోడ్….

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న బిజెపి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్…

దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది…

ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత…

ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమానికి నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు , ఎంపీ కావ్య .

వర్దన్నపేట( నేటిధాత్రి):

Vaibhavalaxmi Shopping Mall

 

ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం,బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.అనంతరం ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.ఓటు చోరీ పై బూత్ స్థాయి, మండల,డివిజన్, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు.

Congress

 

 

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ “ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు అన్నారు.భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత. ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు..ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి పవిత్ర హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ఓటు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తాం అని ఎంపీ తెలిపారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,

పొన్నం ప్రభాకర్ దళిత మంత్రికి క్షమాపణ చెప్పాలి

దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.

 

ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

చట్టవ్యతిరేక కార్యక్రమా లకు పాల్పడితే కఠిన చర్యలు

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శాయంపేట మండల పరిధి లోని రౌడీషీటర్లకు సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల వేళ ఎలాంటి చర్య లకు లోను కాకుండా, లైంగిక నేరాలకు పాల్పడకూడదు చట్టపరంగా జీవించాలని వారు తెలియజేశారు భవిష్య త్తులో పదేపదే ఇటువంటి నేరాలుగాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీటర్ ఓపెన్ చేయడం జరుగుతుం దని పీడీ ఆక్టివ్ అమలు చేసి సంబంధిత చట్టాలను తీసు కొని మీకుకఠిన చర్యలు పడేవి ధంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ

◆:- అధిష్టానం అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం కేంద్రమైన మండల కేంద్రనికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ నుంచి షేక్ రబ్బానీ జెడ్పిటిసి బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం తరఫున ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి అవకాశం లభిస్తే, ఝరాసంగం మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. షేక్ రబ్బానీ 2010 లో పార్టీ మండల అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల మధ్య నుంచి వచ్చిన నేతగా, సమస్యలపై బహుళ అనుభవం కలిగి ఉన్నానని, పార్టీ టికెట్ లభిస్తే మరింత విస్తృతంగా సేవలం
దించేందుకు సిద్ధమని అన్నారు. ఝరాసంగం మండలం నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఏఐఎంఐఎం అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం కోరుతున్నానని పేర్కొన్నారు.

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్లోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మారాటి బాలాజీ (40)ని కారు ఢీకొట్టింది. ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలాజీ, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పూట మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ గౌతమ్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడి తరఫున ఫిర్యాదు అందింది. జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు

సర్పంచ్‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్​అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.

 

పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.

 

మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..

 

శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?

 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

 

అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.

 

ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

డిపాజిట్ తప్పనిసరి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్‌ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్​) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్​చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్​అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్​ బిల్లులు కూడా క్లియర్​ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్..

 

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్‌ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.

లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్..

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్​’ జాబితాను తెలంగాణ గెజిట్‌లో ఎస్‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్‌ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

ప్రతి ఐదుగురిలో ఒక విద్యార్థికి మెడికల్ సీటు

◆:- పేదింటి బిడ్డలకు భరోసా..

సత్ఫలితాలనిస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్-2025లో సత్తాచాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్గోల్, బూచినెల్లి క్యాంపస్ల నుంచి 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు పదేండ్లలో డాక్టర్లుగా 1200 మందికి పైగా గురుకుల విద్యార్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్, మాజీ ముఖ్యముతై కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.. దీంటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు విరునామాగా నిలుస్తు న్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక లోని అల్గోర్ బూచి బూచిపెట్టె గ్రామ గ్రామ శివారులో (టెర్రెస్) మైనార్డ్ గురుకుల క్యాంపస్ విదర్శనం. ఈ రెండు బ్యాండ ల నుండి ఈ ఏడాద్ 18 మందికి పైగా విద్యార్థులు ఎంటి బీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్య వన్దకే గర్వకారణం. ఇఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యా భ్యాసమనేది మీద, మధ్యతరగతి విద్యార్థులకు అందన్ డ్రాక్ష ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే

 

 

పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, విరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కల లను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతో పాటు నాణ్యమైన విద్యను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వ ర్యంలో 66. మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (ప్రతిభా కళాశాలలు) గా తీర్చిదిద్దింది.

 

 

ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యా ర్థులను ఎంపిక చేసి ఐఐటీ, తేవారు, వీటి పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవి ధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్స్ను ఉచి తంగా అందించింది. ఫలితంగా గత పదేం లో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థా యిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశం వారు.

 

 

 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థ ల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సీవోఈలు గిలిచాయంటే అతి శయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోధుల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యా ర్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది..

 

 

మైనార్టి గురుకులాల నుంచే 10 మందికి ఎంబీబీఎస్ సీట్లు

కేసీఆర్ దార్శనికతడు సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నియోజకవర్గంలోని అల్గో అల్గోల్, బూరె వెళ్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయాకళా శాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు జేఈఈ, నీటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.

 

 

దీంతో ఇక్కడి విద్యా ర్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కు లతోపాటు జిల్లా, రాష్ట్రాస్థాయిలో ర్యాంకులు సాదిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని
అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందు తున్నారు. 2020 సంవత్సరానికిగాను నిర్వ హించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచి వెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు హాజర య్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలి తాల్లో ఆయా కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలే జిల్లా సీట్లు సాదించి సత్తా చాటారు.

 

 

అంటే ఇక్కడ చదివిన ప్రతి బదుగురిలో ఒక్కరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుధ గురు కుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిరోస్, ధర్మ తేజ, సిద్ధి రమేశ్, ఎస్వీ ఆయాన్, ఎండీ ఓబెడ్, గౌతమిఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచి వెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా పాతిమా షేక్ సమీనా మర్దార్ గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీర్, తస్లీం, సరేఖ మర్డాన్, ఫిరోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.

 

 

 

గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగా లను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదుని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యా పకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కేసీఆర్ దూరదృష్టికి

◆:- తార్కాణం గురుకులాలు గురుకుల

◆:- విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషం

◆:- ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా
ఎదగడం గర్వకారణం

మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతో ద్యోగులుగా సేవలందించడం గర్వకార ణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచిపల్లి మైచార్జీ గురుకులం ప్రారంభం సంద ర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యూచర్లో ఏం అవు తావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్ష ర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిస్టోన్ అనే విద్యార్థిని మాట నిలబెట్టు కున్నది.

 

 

కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిరోసోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎని మిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంచి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. లీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకు చాల ప్రిన్సిపాళ్లు, ఉపాద్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైం దని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నీరు పేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

 

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం పరిశీలించారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల జీవిత చరిత్రలతో లక్ష్యాలు సునాయాసం

మహనీయుల జీవిత చరిత్రలతో లక్ష్యాలు సునాయాసం

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా వారి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు అనడానికి వాల్మీకి మహర్షి జీవితం నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్ లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు.వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే, ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

Vaibhavalaxmi Shopping Mall

ఈరోజు సిరిసిల్ల కేంద్రంలోని ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని,
మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ — ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.

“కృషి, నిబద్ధత ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు — దీనికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం” అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ,జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన బంధారపు తిరుపతి భాగ్యల కూతురు బంధారపు ఆమని గ్రూప్2 పరీక్ష ఫలితాలలో 765 ర్యాంకుతో ఎంపీఓ ఉద్యోగం సాధించిన సందర్భంగా రామడుగు మండల మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరియు ఆమని తల్లిదండ్రులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మేకల విజయేందర్, దాసరి రత్నమాల, అనిల్, హరీష్, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version