•హరీష్, రేవంత్ లు ..నువ్వు తిట్టినట్టు మాట్లాడు.. నేను కొట్టినట్లు మాట్లాడతా అనే సిద్ధాంతం లో ఉన్నారు. •కుంభకోణాల దొంగ వెంకట్రామిరెడ్డి •కలెక్టర్ గా ఉండి ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన వెంకట్రాం రెడ్డి •పాపం పండి తీహార్ జైలుకు కవిత •ఢిల్లీ నుండి గల్లి వరకు మోడీ పథకాలు •రుణమాఫి చేస్తానని ఆగస్టు లో వాయిదా వేసిన సిఎం •బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు..
నిజాంపేట: నేటి దాత్రి
తెలంగాణ బతుకమ్మగా పిలువబడి కవితమ్మ బతుకమ్మ ఆడకుండా ఢిల్లీలో లిక్కర్ దందా పెట్టిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శించారు.. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భాగంగా మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసి మీడియా ముందు తిట్టుకుంటారే గాని వారిద్దరి మనస్తత్వం ఒకటేనన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ ను వదిలి సొంత పార్టీ పెట్టుకుంటాడని ఆయన అన్నారు. ఏమి తెలియని అయోమయంలో కేటీఆర్ ఉన్నాడన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ బతుకమ్మగా కవితను పొగిడారని కానీ ఢిల్లీలో సారా వ్యాపారం చేసిందన్నారు. చేసిన పాపం ఊరికే పోతాదనీ పాపం పండి తీహార్ జైల్లో ఊసలు లెక్కబెడుతుందన్నారు. ఢిల్లీ నుండి గల్లి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయాన్నారు. రైతులకు గెలవగానే 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించి ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు లో రుణమాఫీ చేస్తానని మాట్లాడడం ఓట్ల కోసమేనన్నారు. ప్రజలను మభ్యపెడుతూ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. బి ఆర్ ఎస్,కాంగ్రెస్ రెండు ఒకటై ప్రజలను పిచోళ్లను చేస్తున్నారన్నారు..5 ఏళ్లు రుణమాఫీ చేయని బి ఆర్ ఎస్,నేడు కాంగ్రెస్ ను రుణమాఫి కోసం విమర్శిస్తున్నారు. రెండు పార్టీలు ఒకటేనని ఆయన్నారు. ప్రజలు ఒకసారి బిజెపి పై నమ్మకం ఉంచి అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మెదక్ ఎంపీ గా దివించి గెలిపిస్తే మెతుకు సీమ కష్టాలను పార్లమెంట్లో మాట్లాడతానన్నారు. అనంతరం పలు గ్రామాల నుండి యువత, ప్రజలు రఘునందన్ రావు చేతుల మీద బిజెపి లో చేరారు.. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయలు, జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ , నిజాంపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రామాయంపేట బిజెపి నాయకులు శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి బిజెపి నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఆకుల రమేష్,నరేష్ మహంకాళి,చంద్రశేఖర్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా పెద్దమ్మ తల్లి పట్నాలు బోనాల ఉత్సవాలకు విచ్చేసిన భక్త జనం కు గ్రామానికి చెందిన చొప్పరీ తిరుపతి 21000 రూపాయల విలువ గల 3500 మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా అంద జేశారు ఈ కర్య క్రమంలో, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిస గోని సత్యం గౌడ్ , పొన్నం తిరుపతి వనం నాగరాజ్ చొప్పరీ రాజయ్య వనం తిరుమలేష్ ఆకుల తిరుపతి ,ఇండ్ల తిరుపతి వనం లక్ష్మణ్ లలో పాటు భక్త జనం,ముదిరాజ్ సంఘం సభ్యులు, పాల్గొన్నారు,
· Only in Siddipet 20 sub-contractors ruined by Konda
· Saying files burnt deceived the sub-contractors
· Changed offices to throw up the payments
· Deceiving nature is common for him
· Always talk about ethics but his acts meant to sink others
· Sufferers of ‘Konda’ now wants to take back their amounts
· They are not able to repay their loans
· Finally they approached ‘Neti Dhatri’
· They began to campaign against Konda Visweswar Reddy
HYDERBAD,NETIDHATHRI:
Those who always invoke ethics will never do well to others. Who always talk about justice tries deceives others. The victims of Konda Visweswar Reddy say that he is one among such Hippocrates. They are saying that Konda intentionally called them towards him and began to deceive in all aspects. Now they resort to rebuke Konda for his deceiving acts those who trusted on him. His evil doing will definitely come to an end at one time. All the victims are looking for such time to arrive. They are also expressing their confidence that he will face the anger of god and used to caution others against felling in the trap of Konda. They want to expose the deceiving nature of Konda in the name of service to people. Anyone if knows his real face never entertain him to come closer and distance themselves from Konda to protect themselves from his fraudulent activities. Konda always speaks ethics with his sweat words and wants look like an elderly man in the society. When we observe him in close, it can be easily understood about his inhuman nature. Knowing about him number of people those who remain victims of his acts, now have been coming forward to expose his real intentions behind his Hippocratic behaviour. Now all of such victims decided to campaign against him in the coming parliament elections. Really curiosity will develop among us to know about those people who got ruined in the hands of Konda Visweswar Reddy. Now, let us start to know about the real story of Konda which totally against to his outside appearance. After the formation of separate Telangana, new government formed under the leadership of KCR began its ‘Mission Bhagiratha’ to provide drinking water facility in all over the state. Konda Visweswar Reddy entered and got contract for some part under this scheme in the name of the company ‘Everest’. Every time he always speaks that, he doesn’t have any business and maintenance of hospitals also done by others and wants to fully indulge in activities related to serve the people. Like other MLAs and political leaders he also spoke the same words like ‘service to people’. Being Member of Parliament, he took every care that no business is being run under his name. The companies or business may not be in the name of him, but without his involvement either business transactions or negotiations takes place. Konda who took the contract works under Mission Bhagiratha in Siddipet district and divided the works in Mandal Wise and gave them in sub-contract form to others. In this process he selected some people and gave them sub-contract works. In this process the total responsibility to pay the bills lies on Konda Visweswar Reddy. Finally he allocated sub-contract works to 20 such persons out of them five belong to Andhra region. Relaying his words all of them brought crores of rupees as loans and began their contract works. Till for some time to establish belief, he paid the bills in regular without any delay. In order to speed up the works he announced some favours to sub-contractors and made them to believe his deceiving words. With relaying full confidence on Konda Visweswar Reddy, sub-contractors successfully completed those works assigned to them. From now onwards they began to understand the real face Konda. He not only made them to roam around him for payments but also created new hopes by assigning new works for them. When new works allocated, sub-contractors continued their belief on him. The other companies who took Mission Bhagiratha works, used to extend their helping hand to their sub-contractors, in the form of supplying material and machineries etc., Unfortunately the Everest company belongs to Konda never supplied single bolt to its sub-contractors. Everybody was in the hope that being MP Konda may allocate new works to them and continue to finish those works assigned to them. With such hope they had completed all those works with the funds took as loan with higher interest rates. After completion of works they began to realise the original nature of Konda, at every time when he tried to conceal them when asked about the payments. After some time, being unable to convince the sub-contractors with this specious reasoning, simply he shifted his Everest office to some other place. Even then sub-contractors continued their visits to the office. In order to escape from them, Konda used to shift his offices from place to place. At one side the interest on loan taken amounts began to rise but they were unable to get the appointment of Konda. Nobody was there in the office to give proper response to them. Those who have good reputation in the society entered in these sub-contract works rely on the words of Konda now almost facing bankruptcy. Bala Subbaiah is one among such sub-contractors who belongs to Andhra region, invested huge amount in these contract works believing Konda now almost in ruined condition. With confidence on Konda he had bear the labour works also. In order to finish the contract works in the stipulated time all the sub-contractors worked hard with their huge investments. Now due to non-receive funds from Konda as promised most of them now turned into daily workers. One sub-contractor from Siddipet named Ramu almost fell in cry when he looked about his present condition. All such sub-contractors since five years have been moving around koda for the payment of bills. Till before six months back Konda used to assure them about the bill payments, but recently the persons belong to Konda resort to beaten them like anything. Asking bill amount is the only mistake they have committed for this punishment. At the same time it is said that Konda also threatened the sub-contractors if this issue of non payment of bills gets exposed. Even then also those contractors used to tell their plights to some people for that reason hundreds of Konda men came and frightened them for the consequences for this act. Konda now telling them the reasons like ‘files burnt away’ and in some times used tell bluntly that he will not repay the bills and whatever want you can do it, like frighten words now became very common from Konda. When sub-contractors contacted people in higher positions, Konda used to tell that he will repay the bills. After that he continues to threaten the contractors and transformed their lives into miserable condition. Like that Konda Visweswar Reddy deceived the sub-contractors to crores of rupees. When Konda came to Huzurabad to make campaign in favour of Etela Rajendar, along with Balasubbaiah all the sub-contractors distributed the pamphlets detailing the fraudulent nature of Konda Visweswar Reddy. Since then Konda stopped his campaign programme in the constituency and continued to hide his face from the people. Now he is contesting from Chevella Parliament Constituency. Now the victims decided to resort house to house campaign detailing the real face of Konda Visweswar Reddy. If re-elected as MP, Konda will continue his deceiving acts so the contractors decided to continue rigorous campaign against him in the Chevella Constituency.
·BRS is going to win majority seats in Parliament elections
·Congress loss credibility
·BJP is facing head-wind
·No other party is able to resist BRS in Telangana
·Congress campaign proved as gobbles.
·People are realising their mistake
·Again all are looking for the leadership of KCR
·BRS will going to play key role in Centre
·Only KCR look after the welfare of Telangana
·KCR only leader who protects the rights of Telangana
·Congress wants only politics
·Within one month Congress real face exposed
·Now people won’t believe Congress sayings.
·Vaddiraju ravichandra with Neti Dhatri Editor Katta Raghavendra Rao.
HYDERBAD,NETIDHATHRI:
In coming Parliament elections Telangana is going to witness some shaking changes. BRS will be going to win majority Parliament seats. Telangana people now are in strong opinion that KCR only able leader who can protect their rights, because he knows well the problems are being faced by the state. At the same time he also knows well how to solve such problems. In previous Assembly elections Congress came into power only with its assurances which are impossible in nature to implement. Without any proper planning during election campaign Congress leaders gave assurances whatever they felt can facilitates to achieve power. Now, after coming to power, they are being unable to fulfil their promises because most of the assurances given are impossible to implement. This inability of Congress leaders has causing people to hate them with their screaming voices. Farmers also turned against them. It is enough to test one or two morsel to know if food is boiled or not. Likewise just within one month period people well understood about the inability of Congress Government in solving their problems. On the day of swearing ceremony itself Congress leaders assured to make sign on six assurances. They also said about the waiver of farming loans up to Rs.2lakh by 9th, December and within hundred days all six guarantees will get implemented. Now Congress Government just twisted its tongue on waiver of farming loans saying that it will be implemented before coming 15th, August, for which there is no guarantee. New Government changed the name of ‘Raitu Bandhu’ as ‘Raitu Bharosa’. Okay there is no problem in changing the name of the scheme. The real problem lies on the ambiguity in implementing this ‘Raitu Bharosa’. We can’t expect more than this from those leaders who confined to play politics and indifferent towards serve the people and state. Now there has been struggle for power is going on inside the party. When Congress requested for one chance, peoples those who have not relayed on the words of it in previous occasions, turned in favour of it and gave power. Now they are realising that, giving power to undeserved people results nothing more than this. In this juncture, people turned in favour to BRS which facilitates to win majority seats in coming Parliament elections. The mass of people who are attending the road shows and public meetings of KCR is only the best example for this. On this occasion Vaddiraju Ravichandra shared his valuable opinions with the Editor of Neti Dhatri Katta Raghavendra Rao. ‘Now the Congress has been facing anger of the state people. Only within three months it has been clear what Congress is? Power cuts, water problems, draught, crop failures with lack of water like experiences those have been facing raising anger among people against this Congress Government. Even when Congress leaders requested for giving them a chance for one time, totally not relaying their words people gave power with only with little majority. They also gave enough seats to BRS to prevent Congress from taking unfavourable decisions. Now if we observe the speaking of Chief Minister Revanth Reddy, they are very much controversial in nature. He is not supposed to talk party workers will turn like ‘human bombs’. Such speaking we never been heard in previous occasions. Chief Minister shall be ideal in nature and guide the people towards development. When questioned about Raitu Bandhu, Congress leaders reacted with harsh and un-parliamentary language with total impatience only shows their inability to implement Raitu Bandhu. They are unable to answer the questions posed by opposition parties. They are just spending their time in criticizing, what had been done by opposition party during its tenure. The people of Telangana fixed to bring back BRS which only can give them golden rule. In this juncture Congress and BJP thinking of contesting against BRS is nothing but to face defeat. Under the perfect training of KCR leadership, the party cadre are being relentlessly working hard for the victory of BRS in the coming elections. The other parties those who are in fray can’t sustain the force of resounding victory of BRS and fell in disappointment of defeat. The people of Telangana will never fell in the trap of false promises of Congress. Alreasy they have been facing trouble under the present Congress tenure and decided to cost their votes in favour of BRS. What the Congress leaders are doing instead every day being in busy with trips to Delhi. In this busy activity they forgot the welfare of the people. They are unable to concentrate on the problems of the people. Previous ten years people already kept aside the Congress. This experience has not been causing any change in the attitude of present leadership. Instead they once again proved that indulging in relentless power struggle is their nature that never be changed. In this background Telangana people decided to dropdown the Congress that sprinkled water on the hopes of Telangana people. At the same time Congress also facing the scarcity of leaders. Large number of party leadership left the party in search of their political future. At the same time most of them are unwilling to rejoin the party treating it like sinking ship. Even the left over small number of leaders are seriously indulging in power politics, that causing to fell the party future in uncertain state. Instead BRS transformed itself as a factory to create leadership. In this juncture Congress again attracting such leaders from BRS and resort to give them tickets to contest. People have been watching all these political play of Congress. The sayings of congress like coming to power in the centre is essential to implement the assurances given in the state never been in convincing nature to the state people. BRS only the party can become torch bearer for all sections of people in Telangana for their all round development.
డిసిసి వైస్ ప్రెసిడెంట్ చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటనను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీని రోడ్ షో ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు శనివారం రోజున మండలంలోని మచ్చుపేట గ్రామం నుండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందని రానున్న ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా రోడ్ షో కార్యక్రమం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు మానేరు వాగు పై ఓడేడు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి ఇటీవల కూలిపోగా సంఘటన స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు
కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి కాంగ్రెస్, బిజేపి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న పార్లమెంటు ఎన్నికల విశేషాలు ఆయన మాటల్లోనే…
`ఎండల్లో కూడా ఏమి జనం..
`కేసిఆర్ను చూడడానికి ఎగబడుతున్న జనం.
`కేసిఆర్ చెప్పేది వినడానికి ఎదురుచూస్తున్న జనం.
`పదేళ్ళ పాటు కేసిఆర్ పాలనలో చల్లగా వున్న జనం.
`పదేళ్ళు కాలు మీద కాలేసుకొని బతికిన జనం.
`కరంటు కోతలు లేవు.
`సాగు నీటికి విరామం లేదు.
`మంచి నీటి కటకట లేదు.
`కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.
`అందుకే తెలంగాణ కేసిఆర్ను కలవరిస్తోంది.
`కేసిఆర్ మాటలు విని పులకరిస్తోంది.
`మళ్ళీ మా కేసిఆర్ను గెలిపించుకుంటామని అంటోంది.
`అందుకే కేసిఆర్ రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతోంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉద్యమ కాలాన్ని మించిన తెలంగాణ అభిమానం జనం కేసిఆర్కు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసిఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు ఇసకేస్తే రానంత జనం హజరౌతున్నారు. స్వచ్చందంగా ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఎండలను కూడా ప్రజలు లెక్క చేయడం లేదు. తమ కోసం వస్తున్న తమ అభిమాన నాయకుడి కోసం ఎంత సేపైనా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రధాత, విధాతను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఆయన చెప్పేది వినేందుకు వస్తున్నారు. ఆయనను చూస్తే చాలు అన్నట్లు బారులు తీరుతున్నారు. ఇది ప్రజల్లో కేసిఆర్కు వున్న క్రేజ్ అన్నది మరోసారి రుజువౌతోంది. అసలు ఇంత ఎండల్లో అంత జనమేమిటన్నది మేమే ఆశ్యర్యపోతున్నాం. అంటే ప్రజలు తమ కష్టాలు తెలిసిన నాయకుడు వస్తున్నాడు. మమ్మల్ని ఆదుకునేందుకు వస్తున్నాడు. మాకు అండగా నిలిచేందుకు వస్తున్నాడు. అన్న ఆలోచన ప్రజల్లో వుంది. అందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్ను చూసి, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు ఎక్కడిక్కడ చీమల దండుగా వస్తున్నారు. రోడ్ షోలు జన సంద్రాలన తలపించేలా చేస్తున్నారు. కేసిఆర్ మాట్లాడుతుంటే జేజేలు పలుకుతున్నారు. మా సిఎం. మా సిఎం. అంటూ జేజేలు పలుకుతున్నారు. కేసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కేసిఆర్ను చూసి పులకించి పోతున్నారు. తమను ఆదుకునే నాయకుడిని మళ్లీ కొంత కాలం తర్వాత ప్రత్యక్షంగా చూడడంతో పార్టీ శ్రేణులు కూడా పూనకాలొచ్చినంతగా సంతోషపడుతున్నారు. కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న క్రేజ్ అంత ఇంతా కాదు. బలమైన ప్రతిపక్షం అంటే ఇలా వుంటతుందని కూడా నిరూపించేలా ప్రజలు కేసిఆర్కు మద్దతుగా వస్తున్నారు. ఇదిలా వుంటే కేసిఆర్ రోడ్ షోలను చూసి, కాంగ్రెస్, బిజేపిల గుండెల్లో రైళ్లు పరుగెడతున్నాయి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఆశలు వదిలేసుకోవాల్సిందే. వాటి అడ్రస్ ఇక గల్లంతే. ప్రజల్లో కాంగ్రెస్ మీద తీవ్రమైన కోపం వుంది. బిజేపి అంటేనే మండిపడుతున్నారు. కేంద్రంలో పదేళ్లు అదికారంలోవుండి బిజేపి తెలంగాణకు తీరని అన్యాయంచేసింది. నాలుగు నెలలకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతోంది. అందుకే ప్రజలు కేసిఆర్ నాయకత్వం కోసం చూస్తున్నారు. కేసిఆర్ రోడ్ షోలను చూస్తున్న కాంగ్రెస్, బిజేపిలు నిన్నటి దాకా ఒక లెక్క..ఇకపై ఒక లెక్క అని రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తోందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర రాజకీయాలు కేసిఆర్ రంగ ప్రవేశంతో మలుపు తిరుగుతున్నాయి. ప్రజలు కేసిఆర్కు బ్రహ్మ రధం పడుతున్న తీరును చూస్తే బిఆర్ఎస్ మెజార్టీ సీట్లను గెలుకుంటుందని చెప్పడంలో సందేహం లేదంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార విశేషాలు…ప్రజల స్పందనలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే… ఎండల్లో ఏమి జనం..ఏమి జనం. నిజంగా అందనం ఆశ్చర్యపోతున్నాం. అంతంత ఎండల్లో ప్రచారాలంటే నాయకులకు ఎంతైనా కొంత ఇబ్బందులే.. ప్రచారాలకు హజరయ్యే ప్రజలను చూసి నాయకులు బాధలు మర్చిపోతారు. మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాలు పంచుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల సినారియో మారిపోయింది. కేసిఆర్ రంగ ప్రవేశంతో బిఆర్ఎస్ ఊపు ఎలా వుంటుందో కాంగ్రెస్, బిజేపిలు చూస్తున్నారు. కేసిఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బిజేపిల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే కేసిఆర్ తన పాలనలో తెలంగాణలో అరవై ఏళ్ల గోసను లేకుండా చేశాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించాడు. అరవై ఏళ్లుగా ప్రజలు పడుతున్న బాధలను నుంచి విముక్తి చేశాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణ తెచ్చేందుకు 14 సంవత్సరాల పాటు సుధీర్ఘమైన పోరాటం చేశాడు. తెలంగాణ సాదించాడు. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసిఆర్ కంటే ప్రజల మీద ఎవరికీ మమకారం ఎక్కువగా వుండదు. ఆ విషయం ప్రజలకు కూడ తెలుసు. కాకపోతే గత ఎన్నికల్లో ప్రజలు కొంత మోస పోయారు. కాంగ్రెస్ చేసిన అసత్య ప్రచారాలను ఆనాడు సమర్ధవంతంగా మేం తిప్పికొట్టలేకపోయాం…అందుకే కొంత గత శాసన సభ ఎన్నికల్లో వెనుకబడిపోయాం. అంతే తప్ప మా పార్టీ ఓడిపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలించింది. బిఆర్ఎస్ ఓడిపోయింది. నిజానికి అది ఓటమే కాదు. కాని గెలిచిన కాంగ్రెస్ మళ్లీ తన పాత వాసనలు వదులుకోలేదు. ఆ పార్టీ పాలనా విధానంలో మార్పు రాలేదు. అదే మోసం…అదే వంచన..నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ను మించిన పార్టీ లేదు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలలో దాగి వున్నవి మొత్తం 13 హమీలు. వాటిలో కేవలం రెండు మాత్రమే అమలు చేస్తూ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటున్నారు. ప్రజలు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలు దేనినైనా భరిస్తారు. కాని నయ వంచనను మాత్రం ఎప్పుడూ క్షమించరు. అదే ఇప్పుడు కాంగ్రెస్కు శాపంగా మారబోతోంది. రైతు బంధు పూర్తి చేయలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు. యువతులకు స్కూటీలు లేవు. ప్రతి మహిళకు రూ.2500 లేవు. అసలు పించన్లే సరిగ్గా అందడంలేదు. నెలకు రూ.4వేలు అన్న హమీకి దిక్కేలేదు. ఇలా చెప్పుకుంటూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీలు గాలికి వదిలేశారు. గెలిచిన వెంటనే రుణ మాఫీ అన్నారు. తర్వాత వందల రోజులు గడువు కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ ఆగష్టు 15 అంటున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విసిసిరిన సవాళును స్వీకరించలేక జారుకున్నారు. అంటే రైతు రుణ మాఫీ చేయలేమని చేతులెత్తేసినేట్లే…కాంగ్రెస్పార్టీ రైతులను నట్టెట ముంచినట్లే…అందుకే ప్రజలు మరోసారి నమ్మడానికి సిద్దంగా లేరు. వారికి ఓట్లేసేందుకు ముందుకు రాదు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిట్టిన టిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఓట్ల ప్రచారం కోసం వెళ్తున్నవారిని అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో చెరువులు ఎండిపోతున్నాయి. పంటలు కొన్ని లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేదు. వడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే…కరంటు కోతలు. మంచి నీటి కటకటలు…ఒక్కటి కాదు. .తెలంగాణ మొత్తం సమస్యలే…అందుకే ప్రజలు కేసిఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ను నమ్మి కష్టాలుకొని తెచ్చుకున్నట్లైందని మధన పడుతున్నారు. పదేళ్ల పాటు చుక్క నీటి కోసం గోస పడిరది లేదు. మంచి నీటి కోసం కులాయి దగ్గరకు వెళ్లింది. బోర్ల వాడకం కూడా ఏనాడో తగ్గిపోయింది. ప్రతి ఇంటికి మిషన్ భగీరధ నీళ్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో నిరంతరం నీటిని సరఫరా చేసిన ఘనత కేసిఆర్ది. ఒకప్పుడు వారానికి ఒక రోజు మంచినీళ్లు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నిత్యం వచ్చేలా చేసిన పాలకుడు కేసిఆర్. మళ్లీ ఇప్పుడు మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యమేమైనా వుంటుంది. పదేళ్ల పాటు ఏ ఒక్కనాడు వాటర్ ట్యాంకర్ల అవసరం హైదరాబాద్ ప్రజలకు రాలేదు. కరంటు కోసం జనరేటర్ల అవసరం పడలేదు. ఇప్పుడు మళ్లీ వాటి అవసరం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేత గాని తనం వల్ల ప్రజలు మళ్లీ గోస పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. నిండు కుండగలాగా, నీళ్ల గంగాళం లాగా వున్న తెలంగాణ భూగర్భాన్ని కూడా ఎండబెట్టిన దిక్కుమాలిన పాలన కాంగ్రెస్ పార్టీది. గత ఐదు నెలల క్రితం కూడా విస్తారంగా వున్న భూగర్భ జలాలు, అడుగంటుతున్నాయి. బావులు ఎండిపోతున్నాయి. బోర్లు పాడౌతున్నాయి. నదుల నీళ్లన్నీ సముద్రం పాలు చేసి, బిఆర్ఎస్ను అబాసు పాలు చేయాలని కుట్రచేశారు. ప్రజలకు నరకం చూపుతున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా వున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామాలలో శుక్రవారం రోజున ఎంపిడివో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఇరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, నిర్దేశించిన కొలతల్లోనే పని పూర్తి చేయాలని, అందరూ ఒక జట్టుగా సమన్వయంతో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడ ,నీరు, ప్రథమ చికిత్స విభాగం వసతుల్ని సమకూర్చి ఉంచాలని పంచాయతీ అధికారులకు తెలియజేశారు. తరువాత అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా గ్రామాలలోని మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న నిర్మాణం పనులను పరివేక్షించి తగు సూచనలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను , పైప్ లైన్లను సందర్శించి తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలియజేశారు.ఈ రెండు గ్రామాల పర్యటనలో ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్,గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నిర్వహిం చిన ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.కూకట్పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరిసతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీప్రచారాన్ని నిర్వహించారు.ఆసియాలో అతిపెద్ద కాల నీగా పేరుందిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎల్ఐజి,ఎంఐజి ఫ్లాట్స్ ప్రాంతంలో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిం చారు.మహిళా అభ్యర్థి కావడంతో మహి ళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప ట్నం సునీత మహేందర్ రెడ్డికి స్వాగతం పలికారు.ప్రజలతో మమేకం కావాలన్న ఉద్దేశంతో టీ సెంటర్ వద్ద టీ కాసి తాగడం విశేషం.గతంలో మరప్పుడు లేని విధంగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ప్రజల నుండి ఆశించినం తగా స్పందన రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలివేరు స్తోంది.ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఆమెతో అధికా రంలోకి వచ్చిందని ఇప్పటికే ఐదు గ్యారం టీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ క్షంలో పరిష్కరించారని ఎన్నికల తర్వాత మిగిలిన హామీలను కూడా అమలు చేస్తా రని హామీ ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో కూక ట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మా జీ అధ్యక్షుడు శేరిసతీష్ రెడ్డి,ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వారు బి అధ్యక్షులు తోమువేణు,జస్వంత్ రావు,( దేశాలు) ప్రవీణ్ కుమార్ 114 డివిజన్ అధ్య క్షులు.బి బ్లాక్ అధ్యక్షురాలు రేష్మ,పొన్నం రజిత,మేకల మైకల్,సంజీవ్రావు,అరవింద్ రెడ్డి,ఫణీంద్ర ,రాజేష్ గౌడ్,శ్నలినీకాంత్,భీ మ్రావు,మారుతి,వాణిసుజాత,నిర్మల,వెం కటేశ్వరరావు,నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉపాధిహామీ కూలీలలకు కనీససౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం గుండాల మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీలోని ఉపాధిహామీ కూలీలతో పని ప్రదేశంలో ఏర్పాటుచేసిన గ్రూప్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. టెంటు,మంచినీళ్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని, పలుగులు, పారలు,తట్టలు ఇవ్వాలని, అలవెన్స్లను పునరుద్ధరించాలని, రోజుకు750 రూపాయల కూలీ చెల్లించాలని,200 రోజులు పని కల్పించాలని, ఎన్ఎంఎంఎస్ ల నుండి ఏపీఓల వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మల్యాల మల్లేష్,పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి ఈర్ప రాజేష్ తప్పెట్ల రాములు, శీలం యాదయ్య,కస్నబోయిన లింగయ్య, గుమ్మడేల్లి వెంకన్న,ఈర్ప రాజేంద్రప్రసాద్,కల్తీ మల్లయ్య,డిల్లి రాంబాబు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేట పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శీలం రాంబాబు గౌడ్ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.దేశంలో మరొకసారి మోడీ ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు గూడూరు సందీప్,కొంపెల్లి రాజు, బూత్ అధ్యక్షులు బూరుగు సాయిరాజ్,సామల ప్రవీణ్ కుమార్ బీజేవైఎం టౌన్ ప్రధాన కార్యదర్శి భవాని శంకర్,బిజెపి నాయకులు బూరుగు చరణ్, మాసు స్వామి, పోల్ సత్యం, బోలు గొడ్డు,అనీల్, సాయికుమార్, పాల్గొన్నారు.
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ
హన్మకొండ, నేటిధాత్రి:
దళిత వ్యతిరేక పార్టీ బిజెపి అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంటి సునీల్ మాదిగ ఆరోపించారు. హన్మకొండ లోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి గుడికి బడికి దూరం కావడానికి ప్రధాన కారణం మనువాదమేనని సందర్భంగా ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగం రద్దుచేసి మనువాదాన్ని అమలు చేయాలని చూసే బిజెపికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలపడం సరికాదన్నారు. గతంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడి భూమినే కబ్జా చేసిన ఆరూరి రమేష్ కు నేడు మద్దతు తెలపడం శోచనీయమని అన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు సమచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కడియం కావ్య గెలుపు కోసం తమ వంతుగా కృషి చేస్తామని సందర్భంగా ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలుకటి జనార్థన్ మాదిగ, కవ్వంపల్లి రవి మాదిగ, జిల్లా అధ్యక్షులుఎర్రోల్ల సురేష్ మాదిగ, నాయకులు మాట్ల రమేష్ మాదిగ,సప్పి పోచన్న మాదిగ జన్ను నరేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
హైదర్నగర్ డివిజన్లోని హైదర్ నగర్ గ్రామము,నందమూరి నగర్ ప్రశాంత్ నగర్,మిత్రాహిల్స్ తదితర బస్తీలు కాలనీలలో శుక్రవారం ఉదయం గడపగడపకు వెళ్తూ ఆయా ఓటర్ల ను కలిసి ఎంపిగా నిలబడిన రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి కిరాణా కొట్టు,ఆటో,రిక్షా,ప్రయాణి కులు కూరగాయల వ్యాపా రస్తులు ఎంతోమంది ఓటర్లను కలుస్తూ వారి ని తమ అభ్యర్థి 10 సంవత్సరాలు ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టిన అనుభవం ఉందని తెలిపారు. మంచి వ్యక్తిని ఎన్నుకొని భవిష్యత్తులో తమ కావాల్సిన అభి వృద్ధి పనులను చేసుకునేందుకు మరింత సుగుమం చేసుకోవాల్సిన అవసరం మన చేతిలోనే ఆయుధ మైన ఓటును కరెక్ట్ పర్సన్కు వేసి మమ్మల్ని పనులు చేయకపోతే నిలదీయాలని కూన సత్యంగౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,వెంక టేష్యాదవ్,సాంబశివరావు,మారుతికుమార్,మణిక్యం,సాదాకృష్ణ మహి ళలు,ప్రజలు,యువకులు తదిత రులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని1వ కేంద్రంలో సంధ్యారాణి అంగన్వాడీ టీచర్ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం కు ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో డిప్యూటీ ఎమ్మార్వో హాజరైనారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరూ జూన్ 2023 నుండి ఏప్రిల్ 24 వరకు పది నెలల కాలంలో పిల్లలు ఆరు అంశాల ద్వారా నేర్చుకున్న కార్యక్రమాలపై పిల్లలకు స్టార్ గుర్తులు ఇస్తూ తల్లులందరికీ పిల్లలు ఎందులో మూడు స్టార్ గుర్తులు వస్తే అన్ని రంగాలలో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నట్లు రెండు స్టార్ గుర్తులు వస్తే కొంత వరకు ఇంకా టీచర్ ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఒక్క స్టార్ గుర్తు వస్తే పిల్ల లు అనారోగ్యపరంగా వెనుకడుగులో ఉన్నారని తల్లిదండ్రులు అన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలని సూచించినారు ముఖ్యంగా మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు ప్రైవేట్ స్కూల్లో వేయకుండా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసినట్లయితే పిల్లలు ఆరోగ్యపరంగా ఎదుగుతూ అన్ని రంగాలలో నేటి బాలలే రేపటి పౌరులుగా మంచి క్రమశిక్షణతో ఉంటారని అందుకు ఈ సంవత్సరము కలెక్టర్ గారు సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు చాలా ఆట వస్తువులు టీవీ ఇవ్వడం కల్తీ లేని ఆకుకూరలు కూరగాయలు పండించాలని పొషనవాటిక ఏర్పాటుచేసి అందులో పండిన ఆకుకూరలను కూరగాయలను వంటలో ఉపయోగించుతు పిల్లలలో వైసులవారిగా ఎదగాలిసిన బరువు ఎత్తు లో మార్పులు తీసుకు రావడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పిల్లల అభివృద్ధి పరిశీలన పత్రాలను ఎమ్మార్వో గారి చేతుల మీదుగా తల్లులకు ఇప్పించడం అయినది ఈ కార్యక్రమంలో సంధ్యారాణి సుజాత తల్లులు హాజరైనారు.
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలం లోని తంగెలపల్లె(దేవునిపల్లి) గ్రామంలో శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ కార్పోరేషన్ చైర్మన్ రజిని సాయిచందు, పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరు.. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ లోని వివిధ గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
# 14 కేసులు,9 మందిని అరెస్టు,175 లీటర్ల నాటు సారా 30 చెక్కెర, స్వాధీనం 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం.
నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ మండలం నాజీ తండా, బొటిమీది తండాతో పాటు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గూడూరు మండలం లోని లక్మన్ తండా గ్రామాల్లో వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ వరంగల్, నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్, గూడూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కలసి జాయింట్ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 14 కేసులు నమోదు చేసి, 9 మందిని అరెస్టు చేయడం జరిగిందని అలాగే 175 లీటర్ల నాటు సారా మరియు 30 కిలోల చెక్కెర స్వాధీనం చేసుకొని, 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు నర్సంపేట ఎక్సైజ్ శాఖ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఈ దాడులలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగేశ్వర్ రావు, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, గూడూరు సీఐ భిక్షపతి, నర్సంపేట సిఐ నరేష్ రెడ్డి, ఎస్సైలు శార్వాణి, రాజేశ్వరి, శిరీష మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 102 కేసులు నమోదు చేసి 70 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది, 711 లీటర్ల నాటు సారా, 1450 కిలోల బెల్లం, 205 కిలోల పటిక మరియు 9 వాహనాలను స్వాధీనం చేసుకొని, 33550 లీటర్ల బెల్లం/ చెక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ దుకాణాలపై దాడులు నిర్వహించి 20 మంది వ్యకులపై కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 59 మంది పాత నేరస్తులను, అనుమానితులను తహసీల్దార్ ల ఎదుట బైండోవర్ చేయడం జరిగింది మరియు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యక్తికి 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని సీఐ నరేష్ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని శుక్రవారం రోజు బాలానగర్ మండలంలోని హేమాజిపూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆ గ్రామంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు..
వనపర్తి నేటిదాత్రి : పార్లమెంట్ అబ్యర్టులపై డేగ కన్ను పెట్టాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు అధికారులను సౌరభ్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి లో ఏర్పాటు చేసిన సమీకృత కంట్రోల్ రూమ్, వ్యయ మదింపు అధికారి ఛాంబర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానటరింగ్ కమిటీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి పరిశీలించారు సి. విజిల్ యాప్ ద్వారా వచ్చివ ఫిర్యాదులు, 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులు వాటిని పరిష్కరించిన నివేదికలు పరిశీలించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎఫ్.ఎస్ టి, ఎస్.ఎస్.టి బృందాల పనితీరు, ఇప్పటి వరకు జప్తు చేసిన వివరాలు , వీడియో పరిశీలకుల నివేదికను పరిశీలించారు. అభ్యర్థులు, పార్టీ తరపున ప్రచార నిమిత్తం సభలు, సమావేశాలు, ర్యాలిలలో ఉపయోగించిన వస్తువులు వాటి ఖర్చు వివరాలను పరిశీలించారు . మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారం వాటి ఖర్చు వివరాలను అడిగి తెలుసులుకున్నారు.అన్ని బృందాలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థులు ఆయా మార్గాల ద్వారా చేస్తున్న ప్రచార వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసుకొని ఖర్చులను పక్కగా వారి ఖాతాలో జమ చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఆయా అభ్యర్థులు, పార్టీలు, స్టార్ క్యాంపేనర్ల ద్వారా చేస్తున్న ప్రచారం పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగిందన్నారు. వారు వాడుతున్న వాహనాలు, ఇతర ప్రచార సామాగ్రి నీ వీడియో తీయించి ప్రచారానికి సంబంధించిన ప్రతి ఖర్చును ఎన్నికల వ్యయంగా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సమీకృత కంట్రోల్ రూం ద్వారా ఎఫ్.ఎస్.టి., ఎస్.ఎస్.టి బృందాలను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నట్లు వ్యయ పరిశీలకులను విశదీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ఎ. ఒ భాను ప్రకాష్ , సి. సెక్షన్ తహశీల్దార్ కిషన్ నాయక్, తదితరులు ఎన్నికల వ్యయ పరిశీలకుల వెంట ఉన్నారు.
# ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మ్యాచ్
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న ఎండీ. జానీపాషా కుమారుడు అష్రఫ్ పాషా అండర్ -16 జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎన్నికై, ఈనెల 29, 30 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో తన సత్తా చూపించబోతున్నట్లు అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐ.ఎన్.టీ యూ. సీ- స్టాపు అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్. డబ్ల్యూ. యూ) నర్సంపేట డిపో నాయకులు గొలనకొండ వేణు శుక్రవారం మీడియాకు తెలిపారు.అష్రఫ్ ప్రస్తుతం లక్నెపల్లి బిట్స్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుచున్నాడు. గత నెల హైదరాబాద్ లో జరిగిన అండర్-16 సెలెక్షన్ పోటీలలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వందలాది క్రికెట్ ఆటగాళ్లకు సెలక్షన్స్ నిర్వహించారు. దానిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన అష్రఫ్ పాషా తెలంగాణ రాష్ట్రం నుండి ఒకే ఒక్క ఆటగాడిగా ఎన్నికవ్వడం విశేషం. ఆయన బ్యాటింగే కాకుండా ఆల్ రౌండర్ స్థాయిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీకాంత్ అరోరా స్టేడియంలో ఈనెల 29, 30 తేదీలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈనెల 29, 30 తేదీలలో అష్రఫ్ ఆడబోయే మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మంచినీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులు, ఉపాధి హామీ పధకం పనులు తదితర అంశాలపై ఎంపిడీవోలు, డిపివోలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ, టి ఎస్ ఈ డబ్ల్యూ ఐడిసి ఇంజినీరింగ్, పంచాయతి క విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గణపురం మండలం, కరకపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పల్లెబోయిన శ్రావణి మరణానికి శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బయం, దిగులుతో సమస్యలు అధిక మవుతాయని, వాటన్నిటినీ అధిగమిస్తూ ధైర్యంగా జీవించాలని అన్నారు. విధుల నిర్వహణలో ఏదేని సమస్య వస్తే ఎంపిడిఓ, డిపిఓ దృష్టికి తేవాలని అక్కడ పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు తెలియ చేయాలని అన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4-7 గంటల వరకు కలెక్టరేట్ నందు అందుబాటులో ఉంటానని కార్యదర్శులు నేరుగా కలసి సమస్యను చెప్పాలని తెలిపారు. సమస్యను మనలోనే దాచుకుని మదన పడటం వల్ల అది అనేక రుగ్మతలకు దారి తీస్తుందని, తద్వారా మనసులో మానసిక సంఘర్షణ జరిగి ఆత్మహత్యల వైపు నడిపిస్తుందని అన్నారు. ఎలాంటి బిడియం లేకుండా నిస్సంకోచంగా తెలియచేయడం వల్ల వత్తిడి తగ్గి మనసు ప్రశాంతత సంతరించుకుంతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సిబ్బంది విధుల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని, నిధులు మంజూరులో అత్యన్త జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విధుల పట్ల క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని, మానసికంగా కృంగిపోయి క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడి విలువైన ప్రాణాలను తీసుకోవద్దని సూచించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ప్లస్, మైనస్ లు ఉంటాయని వాటిని అధిగమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలే కానీ నావల్ల కాదని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి తనువు తాలించడం సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు. ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయని, ప్రపంచంలో సమస్యలు లేని మనిశులు ఉండరని, ప్రతికూల పరిస్థితిల్లో కూడా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శలు విజ్ఞప్తి మేరకు స్టడీ టూర్లు, వత్తిడి అధిగమించేందుకు మెడిటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణరావు, జడ్పి సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ నరేష్, గ్రిడ్ ఈ ఈ మాణిక్యరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అన్ని మండలాల మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎపివోలు, పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో తెలంగాణ తొలి మలి ఉద్యమకారుడు గణపురం టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దివంగత సాయన్న సేవలు మరువలేనివని తెలంగాణ తొలి శాసనసభ సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముక్కెర సాయిలు దశదిన కార్యక్రమం శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్సీ సిరికొండ హజరై సాయిలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ 23 ఏండ్లుగా సాయన్న తన వెంటే ఉండి టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. పార్టీ కార్యక్రమల్లో చురుకుగా పాల్గొంటూ ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజల గుండెల్లో అలుపెరగని ఉద్యమ నాయకుడిగా తనదైన ముద్ర వేసున్నారన్నారు. సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. భౌతికంగా సాయన్న మన మధ్య లేకపోయినా ఎప్పుడూ మన మనస్సులోనే ఉంటారని అన్నారు. సాయిలు ఆత్మను శాంతి చేకూరాలని ప్రార్థించారు. సాయిలు కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బైరగాని కుమారస్వామి గంజి జన్నయ్య మామిడి నరసింహస్వామి మొటపొతుల చందర్ గౌడ్ తంగెళ్లపెల్లి వెంకట్ అకుల తిరుపతి పులిగిల్ల కొవ్వూరి శ్రీనివాస్ ల్యాదల్ల శంకర్ దూడపాక నరసయ్య రమణాచారి తదితరులు ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.