తెలంగాణ బతుకమ్మ కవిత.. ఢిల్లీలో లిక్కర్ దందా

•హరీష్, రేవంత్ లు ..నువ్వు తిట్టినట్టు మాట్లాడు..
నేను కొట్టినట్లు మాట్లాడతా అనే సిద్ధాంతం లో ఉన్నారు.
•కుంభకోణాల దొంగ వెంకట్రామిరెడ్డి
•కలెక్టర్ గా ఉండి ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన వెంకట్రాం రెడ్డి
•పాపం పండి తీహార్ జైలుకు కవిత
•ఢిల్లీ నుండి గల్లి వరకు మోడీ పథకాలు
•రుణమాఫి చేస్తానని ఆగస్టు లో వాయిదా వేసిన సిఎం
•బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు..

నిజాంపేట: నేటి దాత్రి

తెలంగాణ బతుకమ్మగా పిలువబడి కవితమ్మ బతుకమ్మ ఆడకుండా ఢిల్లీలో లిక్కర్ దందా పెట్టిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో విమర్శించారు.. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భాగంగా మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసి మీడియా ముందు తిట్టుకుంటారే గాని వారిద్దరి మనస్తత్వం ఒకటేనన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ ను వదిలి సొంత పార్టీ పెట్టుకుంటాడని ఆయన అన్నారు. ఏమి తెలియని అయోమయంలో కేటీఆర్ ఉన్నాడన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ బతుకమ్మగా కవితను పొగిడారని కానీ ఢిల్లీలో సారా వ్యాపారం చేసిందన్నారు. చేసిన పాపం ఊరికే పోతాదనీ పాపం పండి తీహార్ జైల్లో ఊసలు లెక్కబెడుతుందన్నారు. ఢిల్లీ నుండి గల్లి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయాన్నారు. రైతులకు గెలవగానే 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించి ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు లో రుణమాఫీ చేస్తానని మాట్లాడడం ఓట్ల కోసమేనన్నారు. ప్రజలను మభ్యపెడుతూ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. బి ఆర్ ఎస్,కాంగ్రెస్ రెండు ఒకటై ప్రజలను పిచోళ్లను చేస్తున్నారన్నారు..5 ఏళ్లు రుణమాఫీ చేయని బి ఆర్ ఎస్,నేడు కాంగ్రెస్ ను రుణమాఫి కోసం విమర్శిస్తున్నారు. రెండు పార్టీలు ఒకటేనని ఆయన్నారు. ప్రజలు ఒకసారి బిజెపి పై నమ్మకం ఉంచి అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మెదక్ ఎంపీ గా దివించి గెలిపిస్తే మెతుకు సీమ కష్టాలను పార్లమెంట్లో మాట్లాడతానన్నారు. అనంతరం పలు గ్రామాల నుండి యువత, ప్రజలు రఘునందన్ రావు చేతుల మీద బిజెపి లో చేరారు.. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్,బిజెపి సీనియర్ నాయలు, జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ , నిజాంపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రామాయంపేట బిజెపి నాయకులు శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి బిజెపి నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఆకుల రమేష్,నరేష్ మహంకాళి,చంద్రశేఖర్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version