కూకట్పల్లి,ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి
పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నిర్వహిం చిన ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.కూకట్పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరిసతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీప్రచారాన్ని నిర్వహించారు.ఆసియాలో అతిపెద్ద కాల నీగా పేరుందిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎల్ఐజి,ఎంఐజి ఫ్లాట్స్ ప్రాంతంలో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిం చారు.మహిళా అభ్యర్థి కావడంతో మహి ళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప ట్నం సునీత మహేందర్ రెడ్డికి స్వాగతం పలికారు.ప్రజలతో మమేకం కావాలన్న ఉద్దేశంతో టీ సెంటర్ వద్ద టీ కాసి తాగడం విశేషం.గతంలో మరప్పుడు లేని విధంగా కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ప్రజల నుండి ఆశించినం తగా స్పందన రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలివేరు స్తోంది.ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్ల మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఆమెతో అధికా రంలోకి వచ్చిందని ఇప్పటికే ఐదు గ్యారం టీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ క్షంలో పరిష్కరించారని ఎన్నికల తర్వాత మిగిలిన హామీలను కూడా అమలు చేస్తా రని హామీ ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో కూక ట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మా జీ అధ్యక్షుడు శేరిసతీష్ రెడ్డి,ఈ కార్యక్ర మంలో పాల్గొన్న వారు బి అధ్యక్షులు తోమువేణు,జస్వంత్ రావు,( దేశాలు) ప్రవీణ్ కుమార్ 114 డివిజన్ అధ్య క్షులు.బి బ్లాక్ అధ్యక్షురాలు రేష్మ,పొన్నం రజిత,మేకల మైకల్,సంజీవ్రావు,అరవింద్ రెడ్డి,ఫణీంద్ర ,రాజేష్ గౌడ్,శ్నలినీకాంత్,భీ మ్రావు,మారుతి,వాణిసుజాత,నిర్మల,వెం కటేశ్వరరావు,నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.