మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి…
ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… మహమూద్ పట్నం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు
కేసముద్రం నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలకు అలాగే ప్రతి పేదవానికి లబ్ధి చెందేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిజమైన లబ్ధిదారులకే చెందేలా ఎంతో పటిష్టంగా అధికారులచే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో ఇసం పెళ్లి సారమ్మ వైఫ్ ఆఫ్ మల్లేష్, సొంత ఇంటి కలను నిజం చేస్తూ వారి ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్ట గడుపుల యాకు తొగరి నవీన్ మాజీ ఎంపిటిసి ముంజల శ్రీనివాస్ కాసు రాజేంద్ర చారి చిలువేరు శివాజీ పోలు శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.