శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు..

Sri Umamaheshwari. Sri Umamaheshwari.

శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు భద్రాచలం ఆలయ ఏఈఓ కు అందజేత

ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకులసుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి.

గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామం నుండి భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు గోటుతో వలసిన తలంబ్రాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మ రావు పేట శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి భద్రాచల పురవీధులలో కోటి గోటీ తలంబ్రాలు ముత్యాలు పళ్ళు పూలు స్వీట్ తో పాటు ఊరేగింపుగా తీసుకొని స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గోటి తలంబ్రాలను ఆలయ అధికారి ఏఈఓ కు అందజేయడం జరిగింది గోటి తలంబ్రాలతో పాటు శ్రీరామనవమికి మహా అన్నదాన ప్రసాదం కొరకు రెండు క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు 100 మంది సేవకులుగా చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని శ్రీ ఉమామహేశ్వర సేవాసమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆకుల దామోదర్ దేనికి రాజేందర్ కనికల శివకృష్ణ కురిమిళ్ళ తిరుపతి తనికెళ్ళ వసంత పోలు రాజమ్మ తదితర సేవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!