# అర్హతలేని డాక్టర్ వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన వైద్యాధికారులు.
# వందన,పావని,విఎన్అర్,లీల ఆసుపత్రులలో తనిఖీలు.
# గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు…
# జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ
అధికారి డాక్టర్ ప్రకాష్ హెచ్చరికలు..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని పావని నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో అర్హతలేని వైద్యం చేస్తున్నారని గుర్తించి అలాగే వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఆసుపత్రిలో సూచనలు లేవనే కారణాలతో ప్రైవేటు ఆసుపత్రికి హెచ్చరిక నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ ప్రకాష్ తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకట రమణ ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాష్ తో వైద్యాధికారులు బృందం నర్సంపేట పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు వందన నర్సింగ్ హోమ్, పావని నర్సింగ్ హోం, వియన్ఆర్ హాస్పిటల్, లీల హాస్పిటల్ లలో తనిఖీలు నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డికి సంబంధించిన పావని నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఉండవలసిన డాక్టర్లకు బదులుగా ఇతర శ్రీనివాస్ అనే డాక్టర్ పనిచేయడం జరుగుతున్నదని తెలిపారు.ఆయనకు సంబందించిన అర్హత ద్రువపత్రాలను చూపించాలని తెలుపగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని పేర్కొన్నారు.అలాగే అర్హత లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తున్న సిబ్బందిని గుర్తించి ఆ సిబ్బంది ద్వారా మేనేజ్మెంట్ కు నోటీసులు ఇచ్చినట్లు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రకాష్ తెలిపారు.మాత శిశు సంక్షేమ అధికారి డాక్టర్ ఆచార్య గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేయు ప్రైవేటు ఆస్పటల్ లో తనిఖీలు నిర్వహించినారు.
ప్రైవేట్ హాస్పిటల్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అబార్షన్ చేసిన, అనవసరమైన ఆపరేషన్స్ చేసిన, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తున్న, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అనుమతి పొందని డాక్టర్లు వైద్యం చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు ఉంటాయని డాక్టర్ ఆచార్య హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ అధికారి డాక్టర్ ఆచార్య డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ,ఎల్.డి కంప్యూటర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.