న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి..

న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి
ఎస్సై బోరు గల అశోక్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపు కోవాలని ఎస్సై బోరు గల అశోక్ అన్నా రు. శనివారం విలేకరులతో మాట్లా డుతూ డిసెంబర్ 31న అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మొగుళ్ళపల్లి మండలంలోఆవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ప్రజల భద్రత శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించు కోవడం ప్రతి ఒక్కరికి హాక్కేననిఅయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై తిరగరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version