జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య
వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల
దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్
జడ్చర్ల / నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో మోదీ చంపినట్లు ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుసగా గుర్తుతెలియని వ్యక్తులు కావేరమ్మపేట ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉండడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. తాజాగా మంగళవారం ఉదయం మృతి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా కలిగి ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు.