శంభో శివ శంభో… శాయంపేటలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో, పరమ శివునికి అభిషేకాలు అర్చ నాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో మచ్చగిరిస్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ,చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకున్నారు లయకారునిగా, అర్ధనారీశ్వ రునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా ఉంటుంది.జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆయువు ఆరోగ్యాలతో ప్రసాదించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి -రాజమణి, బాసని మల్లికార్జున్-రాణి, మామిడి మారుతి దంపతులు,కొండ బత్తుల ప్రకాష్ దంపతులు, లోకలబోయిన కుమారస్వామి కొత్తపెల్లి రవీందర్, ప్రజలు పాల్గొన్నారు.