భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి – కలెక్టర్…

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య.

తహసిల్దార్ కార్యాలయం నుండి వచ్చే ప్రతి ఫైల్ నిర్ణీత ప్రొఫార్మాలో పంపాలి.

ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట, వెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ పి ప్రావీణ్య, రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఆదేశించారు. గురువారం జిల్లా లోని ఆర్ డి ఓ లు, తహశీల్దార్ల తో కలెక్టరేట్ సమావేశమందిరంలోభూభారతి అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన పూర్తి వివరాలు జత చేసి తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయానికి ఆర్డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ కు పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు . నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి సంబంధిత స్థలాలను పరిశీలించి విచారణ జరపాలని అధికారులకు సూచించారు. వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, జీఐఎస్ ఆధారిత సర్వే డిజిటైజేషన్ వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి, భూ రికార్డులను పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామాలు కు సంబంధించి పూర్తి వివరాలతో వచ్చిన దరఖాస్తు అన్నిటికి సంబంధించిన ఫైళ్లను అన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు .కలెక్టరేట్ వచ్చిన ఫైళ్లను కలెక్టరేట్ కు సంబంధించి సెక్షన్ అధికారులు క్షుణ్ణంగా సెక్షన్ అధికారులు వచ్చిన ఫైల్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఫైల్ నోట్లు రాసి సిద్ధం చేయాలన్నారు . ఒకవేళ ఫైల్ రిజెక్షన్ అయితే ఎందుకు రిజెక్షన్ చేశాము, అన్న వివరాలు సైతం నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు తాసిల్దార్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయాల నుండి వచ్చిన ఫైళ్లను జిల్లా స్థాయిలో రూపొందించిన నిర్ణీత ప్రొఫార్మ ప్రకారం సంబంధిత ఫైల్స్ రానున్న 15 రోజుల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) మాధురి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి / జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అందోల్ ఆర్డీఓ పాండు సంగారెడ్డి ,జి.రాజేందర్,జిల్లా లోని తహసీల్దార్లు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version