చొరవాణి అందజేత
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి :
మండలంలోని వేముల కుర్తి లోని పౌల్ట్రీ ఫారం నందు పనిచేసే మహమ్మద్ అత్తర్, R/o సిద్దిపేట కి చెందిన అతను 19.02.2025 రోజున తన యొక్క ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 21.02.2025 రోజున అతడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే (CEIR Portal )లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్న తన ఫోనును ఈరోజు ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను (CEIR Portal )లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని A.అనిల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం గారు తెలిపినారు.