బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలం బడంపేట గ్రామంలో బుధవారం సర్పంచ్ దయానంద్ పాటిల్ ఆధ్వర్యంలో 365 మంది లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాతరి ఏసప్ప, మొగులయ్య, బసవరాజ్, స్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది.
