బండిల దొడ్డి లాగా మారుతున్న ప్రభుత్వ బడులు , కనీసం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకైనా కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్……….
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిటిఎల్ రవి
మంగపేట నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభం అయ్యేవరకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ మండపేట మండల కమిటీ మంగపేట తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఏసుపాదం కి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి, ఎల్. రవి మాట్లాడుతూ. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.. కనీసం పాఠశాల ప్రారంభం అయ్యేవరకు మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే వర్షాలు ప్రారంభమై పాఠశాల ఆవరణ లో గదులలో ప్లడ్డు చేరి విష జ్వరాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ఆవరణలో పాఠశాలలను పరిశుభ్రం చేసి మరుగుదొడ్లు నిర్మించి , కరెంటు, త్రాగు నీరు, ఉచిత టెక్స్ట్ ,బుక్స్ నోట్, యూనిఫార్మ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను పరిశుభ్రంగా ఉంచాలి ,అలాగే పాఠశాలలో పరిశుభ్రం లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేరే పరిస్థితి చేయి దాటిపోయిందని ఇలాగే జరిగితే ముందు ముందు ప్రభుత్వ పాఠశాలలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని వెంటనే బాత్రూంలు ,మరుగుదొడ్లు అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇసుక ర్యాంపు లు ఎక్కువ ఉండటం వలన లారీలు విపరీతంగా రావడం వల్ల ఆక్సిడెంట్లు బాగా అవుతున్నాయి జూన్ 12న నుంచి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి 5 గంటల వరకు లారీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల విద్యార్థులంతా ఏకమై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.. అదేవిధంగా మంగపేట మండలంలో ఉన్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులనువారి వారి మాతృ పాఠశాలలోనే ఉంచాలని కానీ ఎటువంటి డిప్యూటీషన్లో ఇతర పాఠశాలకు అధికారులు పంపించకూడదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లంజపల్లి సిద్దు, కాట ముకుందం, తోకల మురళి తదితరులు పాల్గొన్నారు